Turkey: టర్కీలో ధరల భగభగ.. ఆహారం కూడా కొనుక్కోలేని దుస్థితి
టర్కీలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువులు సైతం కొనుక్కోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.......
దిల్లీ: టర్కీలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువులు సైతం కొనుక్కోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ దేశంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు 19 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ డిసెంబర్ నాటికి 36.08 శాతానికి ఎగబాకింది. డిసెంబర్లో వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే 13.58 శాతం మేర పెరిగిందని టర్కీ గణాంక సంస్థ ప్రకటించింది. ఆహార ధరల్లో వార్షిక పెరుగుదల 43.8 శాతంగా ఉందని పేర్కొంది. అయితే స్వతంత్రంగా పనిచేసే ‘ద్రవ్యోల్బణ పరిశోధన బృందం’ మాత్రం దేశంలో ద్రవ్యోల్బణం 83 శాతానికి చేరిందని తెలిపింది. వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే డిసెంబర్లో 19.35 శాతం పెరిగిందని వివరించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినా.. 2002 సెప్టెంబర్ తర్వాత అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఇదే. ఓ వైపు ధరలు భారీగా పెరుగుతుండటంతో టర్కీ కరెన్సీ ‘లిరా’ రోజురోజుకూ పతనమవుతోంది. అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ఒత్తిడితో కీలక వడ్డీ రేట్లపై ఆ దేశ సెంట్రల్ బ్యాంకు కోతలు విధించడంతో కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. తద్వారా దిగుమతులు కష్టతరమయ్యాయి. దీంతో వస్తువుల ధర భారీగా పెరిగింది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తోంది.
డాలర్తో పోలిస్తే గతేడాది లిరా 44 శాతం పతనమైంది. ఒక డాలరుకు 18.36 లిరాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో అధ్యక్షుడు ఎర్డోగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత కరెన్సీ కొంతవరకు కోలుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఒత్తిళ్ల మధ్యే కొనసాగుతోంది. టర్కీలో 8.4 కోట్ల మంది నివసిస్తుండగా.. అందులో చాలా మంది కనీసం ఆహారం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది తమ సేవింగ్స్ను కాపాడుకునేందుకు విదేశీ కరెన్సీని, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప