Aryan Khan case: ఆర్యన్ ఖాన్ కేసులో ట్విస్ట్: సంచలన ఆరోపణలు చేసిన సాక్షి!
ముంబయి డ్రగ్స్ వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
తోసిపుచ్చిన దర్యాప్తు సంస్థ ఎన్సీబీ
దిల్లీ: ముంబయి డ్రగ్స్ వ్యవహారం కొత్తమలుపులు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేస్తూ మహారాష్ట్ర మంత్రులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై వాంఖడే ఇదివరకే దీటుగా బదులిచ్చారు. తాజాగా ఈ వ్యవహారంలో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్సీబీపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ-దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ తనతో బ్లాంక్ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని ఆరోపించాడు.
షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టైన ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో తొమ్మిది మందిని ఎన్సీబీ సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవి కూడా ఒకరు. ఇందులో భాగంగా గోసవి బాడీగార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్ సెయిల్ను ఎన్సీబీ విచారించింది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ సెయిల్ ఎన్సీబీ దాడులతో పాటు ఈ డ్రగ్స్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశాడు. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుంచి ప్రాణాపాయం పొంచి ఉందని ఆరోపించారు. క్రూజ్పై దాడి జరిగిన తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నాడు. వీటికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ నార్కొటిక్ డ్రగ్స్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. దీంతో ఈ కేసు దర్యాప్తు మరిన్ని మలుపులకు దారితీయనున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆర్యన్ ఖాన్తో గోసవి దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఆర్యన్కు గోసవికి మధ్య ఉన్న సంబంధంపై ఎన్సీబీ దృష్టిపెట్టింది. ప్రస్తుతం గోసవి పరారీలో ఉండడంతో ఆయనపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకే..
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి నుంచి ఎన్సీబీ డబ్బులు అడుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. తెల్ల కాగితాలపై ఎన్సీబీ సాక్షుల సంతకాలు తీసుకుంటోందని రౌత్ ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ను కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే భావిస్తున్నారని ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఎన్సీబీ కార్యాలయంలో గోసవి ఆర్యన్ఖాన్ చేత ఫోన్లో మాట్లాడిస్తున్నట్లు ఉంది. ప్రభాకర్ సెయిల్ ఆరోపణలు చేసిన కాసేపటికే సంజయ్ రౌత్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్సీబీ..
గోసవి ఉద్యోగి చేసిన ఆరోపణలను ఎన్సీబీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ముడుపుల వ్యవహారం జరిగితే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంకా జైలులోనే ఎందుకుంటారు. దర్యాప్తు కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని.. అటువంటి సంఘటనలు జరిగే ఆస్కారమే లేదు. కేవలం దర్యాప్తు సంస్థ ఇమేజ్ను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఎన్సీబీ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM