Stand-up comedy: వీర్దాస్.. కామెడీ పేరుతో పరువు తీస్తున్నావు?
ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్దాస్ ‘డ్యుయల్ ఇండియా (Dual India)’ పేరుతో వ్యంగ్యంగా చేసిన ఓ ప్రదర్శన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.
‘టూ ఇండియాస్’ ప్రదర్శనపై మండిపడ్డ భాజపా
దిల్లీ: ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్దాస్ ‘డ్యుయల్ ఇండియా (Dual India)’ పేరుతో వ్యంగ్యంగా చేసిన ఓ ప్రదర్శన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. ముఖ్యంగా విదేశీ నేలపై భారత్ను అవమానపరిచారంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందంటూ మద్దతు పలుకుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన భాజపా.. దిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇక కాంగ్రెస్లో కొందరు నాయకులు వీర్దాస్ ప్రదర్శనను ఖండించగా.. మరికొందరు మాత్రం ఆయన వాస్తవాలే చెప్పారంటూ మద్దతు పలుకుతున్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న కమెడియన్ వీర్దాస్.. వాషింగ్టన్లో ఉన్న జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్లో ఈమధ్యే ఓ ప్రదర్శన (Stand-up Comedy) ఇచ్చారు. అందులో భాగంగా భారత్లో కరోనా వైరస్, అత్యాచారాలు, మహిళా స్వేచ్ఛతో పాటు పలు అంశాలను రెండు కోణాల్లో ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా వివరించారు. ‘ఐ కమ్ ఫ్రమ్ టూ ఇండియాస్ (I Come From Two Indias)’ అనే పేరుతో రూపొందించిన ఈ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో కొన్ని భాగాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ముఖ్యంగా పగలు మహిళలను పూజిస్తూ.. రాత్రివేళల్లో గ్యాంగ్ రేప్లకు పాల్పడే దేశం నుంచి వచ్చానంటూ వీర్దాస్ చెప్పడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇదే సమయంలో భారత్ ఎదుర్కొంటున్న భిన్న సమస్యలను విదేశాల్లో ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతోమంది మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయన చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నారు. ఇలా వీర్దాస్ కామెడీ షోపై రాజకీయ పార్టీలు, సామాన్యుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
దేశాన్ని అవమానిస్తే సహించేది లేదు..
భారత్ను అవమానపరుస్తూ వీర్దాస్ అమెరికాలో ప్రదర్శన ఇచ్చారని ఆరోపిస్తూ దిల్లీ భాజపా నేత ఆదిత్య ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీర్దాస్ను అరెస్టు చేసేవరకు పోరాడుతానన్న ఆయన.. విదేశీ నేలపై భారత్ను అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఆదిత్యతోపాటు పలువురు నేతలు వీర్దాస్ షోను తప్పుపట్టారు.
కాంగ్రెస్ నాయకుల మిశ్రమ స్పందన..
వీర్దాస్ షోను కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ తీవ్రంగా ఖండించారు. కొంతమంది వ్యక్తులు చేసే దుర్మార్గాలను దేశం మొత్తం అన్వయిస్తూ చెప్పడం సరికాదన్నారు. వలస పాలనలో పాశ్చాత్య దేశాల ముందు భారత్ను తప్పుగా చిత్రీకరించే ఉనికి ఇంకా పోలేదని తెలుస్తుందన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం వీర్దాస్కు మద్దతు తెలిపారు. స్టాండప్ కమెడియన్గా పేరొందిన వీర్దాస్కు ‘స్టాండ్ అప్’ అంటే కేవలం భౌతికంగా నిలబడడం మాత్రమే కాదని.. దానిలో ఉన్న నైతికత కూడా ఆయనకు తెలుసునని ప్రశంసించారు. ఇది కేవలం కామెడీ మాత్రమేనని.. ఎగతాళి మాత్రం కాదని శశిథరూర్ చెప్పుకొచ్చారు. ఇక వీర్దాస్కు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ మద్దతు తెలిపారు.
ఈ ప్రదర్శనపై వివాదం చెలరేగడంతో కమెడియన్ వీర్దాస్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని.. ఇది కేవలం వ్యంగ్యంలో భాగం మాత్రమేనని ట్విటర్లో వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్