Aryan khan: మొదటిసారి పెదవి విప్పిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మొదటిసారి పెదవి విప్పారు. డ్రగ్స్ ఒక్క మహారాష్ట్రలోనే దొరికాయా..? ముంద్రా పోర్టులో దొరికిన వాటి సంగతేంటి..? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవద్దంటూ సవాలు విసిరారు. దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు.
భాజపాపై విమర్శలు గుప్పించిన ఉద్ధవ్ ఠాక్రే
ముంబయి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మొదటిసారి పెదవి విప్పారు. డ్రగ్స్ ఒక్క మహారాష్ట్రలోనే దొరికాయా..? ముంద్రా పోర్టులో దొరికిన వాటి సంగతేంటి..? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు మానుకోవద్దంటూ సవాలు విసిరారు. దసరా సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు.
‘డగ్స్ను మహారాష్ట్రలో మాత్రమే స్వాధీనం చేసుకున్నారా? ముంద్రా పోర్టులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దొరికాయి. మీ ఏజెన్సీలు చిటికెడు గంజాయిని పట్టుకుంటుంటే.. మా పోలీసులు రూ.150 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. సెలబ్రిటీలను అదుపులోకి తీసుకొని, ఫొటోలు దిగడం పట్లే మీకు ఆసక్తి ఉంది. వచ్చే నెల మా సంకీర్ణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే పలు మార్లు మా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు జరిగాయి. మీ ప్రయత్నాలు మానుకోకండి’ అంటూ భాజపాను ఉద్దేశించి ముఖ్యమంత్రి సవాలు విసిరారు. మహారాష్ట్రపై భాజపా దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. ‘వారు ముంబయి పోలీసుల్ని మాఫియా అని పిలుస్తారు. మరి యూపీ పోలీసుల్ని ఏమని పిలవాలి?’ అంటూ విమర్శలు గుప్పించారు.
భారతీయులందరి పూర్వీకులంతా ఒకరేనని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రకటనను ఠాక్రే ప్రస్తావించారు. ‘ప్రతిపక్ష పార్టీనేతలు, రైతుల పూర్వీకులు వేరే గ్రహం నుంచి వచ్చారా? అధికారం కోసం చేసే ఈ ప్రయత్నాలు సరికాదు. అధికార కోసం తాపత్రయం వ్యసనం లాంటిది. డ్రగ్స్ వ్యసనంగా మారితే అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అదే అధికారం కోసం ఆరాటం ఇతరుల కుటుంబాలను నాశనం చేస్తుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజుల క్రితం ముంబయి తీర ప్రాంతంలో క్రూజ్ నౌక ఘటనలో ఆర్యన్ ఖాన్ సహా మరికొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆ ఘటనలో ఆర్యన్కు ఇప్పటివరకు బెయిల్ దొరకలేదు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్