China-US Cold War: ఇలాగే కొనసాగితే.. ప్రచ్ఛన్న యుద్ధమే..!
అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరికొంత కాలం కొనసాగితే భవిష్యత్తులో ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) సంభవించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, చైనాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరికొంత కాలం కొనసాగితే భవిష్యత్తులో ప్రచ్ఛన్న యుద్ధం (Cold War) సంభవించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. అది రెండు దేశాలతోపాటు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే అలాంటి పరిస్థితులను నివారించడానికి.. రెండు అతిపెద్ద, శక్తివంతమైన దేశాలు తమ సంబంధాలను చక్కబెట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ దేశాల నేతలు ఒకే వేదికపైకి వచ్చే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో ఐరాస ఈ విధంగా స్పందించింది.
‘ప్రపంచంలో పెద్ద ఆర్థికశక్తులుగా ఉన్న రెండు దేశాలు వాతావరణ మార్పులు, వాణిజ్యం, సాంకేతికతలే కాకుండా మానవ హక్కులు, ఆర్థిక వ్యవస్థ, ఆన్లైన్ భద్రత, దక్షిణ చైనా సముద్రం సార్వభౌమత్వం విషయంలో ఇరు దేశాలు సహకారం అందించుకోవాలి. కానీ, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణ నెలకొంది. ఇది మరింత ముదరకముందే రెండు దేశాలు తిరిగి వాటి సంబంధాలను మెరుగుపరచుకోవాలి’ అని ఐక్యరాజ్య సమితి సెక్రటరి జనరల్ ఆంటోనియో గుటెరస్ సూచించారు. ఇవే కాకుండా వ్యాక్సినేషన్, వాతావరణ మార్పులతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. శక్తివంతమైన దేశాల మధ్య నిర్మాణాత్మక సంబంధాలు లేకుండా అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని గుటెరస్ అభిప్రాయపడ్డారు.
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించడం, ఆర్థిక నిబంధనలు, పోటాపోటీ మిలటరీ వ్యూహాలను చూస్తే రానున్న రోజుల్లో ప్రపంచం రెండుగా చీలిపోయే ముప్పు ఉందని ఐరాస చీఫ్ రెండేళ్ల క్రితమే హెచ్చరించారు. అయినప్పటికీ ఇరు దేశాల సంబంధాల్లో మార్పు రాలేదు. ఇదే విషయాన్ని మరోసారి ఉద్ఘాటించిన ఆంటోనియా గుటెరస్.. వీలైనంత తొందరగా ఇరు దేశాల మధ్య సంబంధాలను చక్కబెట్టుకోవాల్సి ఉందని హితవు పలికారు. రానున్న రోజుల్లో ఇవి మరింత ఎక్కువై ప్రచ్ఛన్న యుద్ధంగా మారితే అత్యంత ప్రమాదకరమైన, నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. అందుకే అలాంటి వాతావరణాన్ని అన్నివిధాలా నివారించడమే ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వీటితో పాటు అఫ్గానిస్థాన్లో తాజాగా నెలకొన్న పరిస్థితులపైనా ఐరాస చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి సంక్షోభాన్ని తొలగించడంలో భాగంగా అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్