UN: లక్షమంది నిరాశ్రయులైపోతారు.. కూల్చొద్దు!
హరియాణాలోని ఖోరి గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది.
ఖోరి గ్రామంపై భారత అధికారులకు ఐరాస విజ్ఞప్తి
ఛండీగఢ్: హరియాణాలోని ఖోరి గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ భారత అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఖోరి గ్రామంలో నిర్మాణాలను కూల్చివేసే నిర్ణయాన్ని వెంటనే పునః సమీక్షించుకోవడంతో పాటు, వారి పునరావాసంపై మరోసారి పరిశీలించాలని కోరింది. సకాలంలో వారికి పరిహారం అందించడంతో పాటు పరిష్కారం లభించే వరకు ఎవ్వరినీ బలవంతంగా ఖాళీ చేయించకూడదని పేర్కొంది. తద్వారా లక్ష మంది ప్రజలు నివాసం లేనివారు కాకుండా జాగ్రత్తపడవచ్చని అభిప్రాయపడింది. ముఖ్యంగా వారిలో దాదాపు 20వేల మంది చిన్నారులు కూడా ఉన్నారని.. తాజా చర్యలతో వారంతా నిరాశ్రయులు అవుతారని ఐరాస విభాగం ఆందోళన వ్యకం చేసింది.
భారత్ అసంతృప్తి.. వెనక్కి తగ్గిన యూఎన్
ఓవైపు కరోనా మహమ్మారి, మరోవైపు వర్షాకాల సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషన్ (OHCHR) ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత్ స్పందించేలోపే వీటిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఐరాస మానవ హక్కుల విభాగం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై తాము సమాధానం ఇచ్చేలోపే మీడియా ప్రకటన విడుదల చేయడం దురదృష్టకరమని పేర్కొంది. అయితే, ఐరాస మానవ హక్కుల విభాగం తొందరపాటు చర్య దురదృష్టకరమని భారత్లోని ఐరాస శాశ్వత కమిషన్ స్పష్టం చేసింది. భారత సుప్రీంకోర్టుపై ప్రత్యేక ప్రతినిధి చేసిన అగౌరవ వ్యాఖ్యలపైనా ఆందోళన వ్యక్తంచేసిన యూఎన్, ఇలాంటి చర్యలు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. దేశ ప్రజల మానవ హక్కుల బాధ్యతల గురించి భారత్కు పూర్తిగా తెలుసని.. వాటి అమలుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని మరో ప్రకటనలో వెల్లడించింది.
హరియాణాలోని ఖోరి గ్రామంలో అటవీ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను జూన్ 7న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నిర్మాణాలు అటవీ భూమిలో చేపట్టినందున ఎటువంటి మినహాయింపూ ఇచ్చేదిలేదని స్పష్టం చేసింది. వాటి తొలగింపునకు ఆరువారాల గడువు ఇచ్చిన కోర్టు.. ఈ ప్రక్రియను జులై 19 నాటికి పూర్తిచేయాలని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిర్మాణాలను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆ గ్రామంలో 172 ఎకరాల అటవీ భూమిలో దాదాపు 5300 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ఇప్పటికే 2 వేల ఇళ్లను నేలమట్టం చేసినట్లు సమాచారం. గడిచిన మూడు రోజుల్లోనే 800 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. అయితే, చట్టప్రకారం వారందరికీ పునరావాసం కల్పిస్తున్నామని ఫరీదాబాద్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు