Booster Shots: అమెరికా కీలక నిర్ణయం.. 18ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు!
కరోనా వైరస్ నుంచి ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడినవారందరికీ బూస్టర్ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది.....
వాషింగ్టన్: కరోనా వైరస్ నుంచి ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ బూస్టర్ డోసులు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఫైజర్, మోడెర్నా బూస్టర్ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్డీఏ) అనుమతిచ్చింది. గతంలో 65ఏళ్లు పైబడినవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి మాత్రమే అమెరికా బూస్టర్ డోసులను అందించింది. తాజా నిర్ణయంతో 18 ఏళ్లు పైబడిన ఎవరైనా బూస్టర్ షాట్ తీసుకునేందుకు అర్హులే. దీంతో కోట్లాది మంది లబ్ధి పొందనున్నారు. శీతాకాలంలో కొవిడ్ కేసులు పెరిగే అవకాశాలున్నాయంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘ఆసుపత్రిలో చేరడం, మరణాలు వంటి తీవ్రమైన పరిణామాలు సహా మహమ్మారి నుండి ప్రజలకు నిరంతరం రక్షణ అందించడంలో ఈ నిర్ణయం ఎంతగానో సహాయపడుతుంది’ అని ఎఫ్డీఏ తాత్కాలిక కమిషనర్ జానెట్ వుడ్కాక్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మోడెర్నా సీఈఓ స్టెఫాన్ బాన్సెల్ స్పందించారు. ‘శీతాకాలంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయుక్తం కానుంది’ అని అన్నారు.
ఏ టీకా అయినా తీసుకోవచ్చు
అయితే, రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకునేందుకు ప్రజలు అర్హులు. గతంలో ఏ టీకా తీసుకున్నా.. బూస్టర్ షాట్గా మరేదైనా కూడా తీసుకోవచ్చు. సింగిల్ డోసు టీకా అయిన జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకున్నవారు కూడా బూస్టర్ డోసు తీసుకునేందుకు అర్హులే. అమెరికాలో ఇప్పటివరకు 19.5 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు. వారిలో 3 కోట్ల మంది ఇప్పటికే మూడో డోసు వేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్