US: రికార్డు కేసులతో అమెరికా విలవిల.. ఒమిక్రాన్ మంచు తుపాను రాబోతోందన్న నిపుణులు..!
కరోనావైరస్ ధాటికి అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
చిన్నారుల్లో పెరుగుతున్న ఆసుపత్రుల్లో చేరిక
వాషింగ్టన్: కరోనావైరస్ ధాటికి అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో దేశాన్ని ఒమిక్రాన్ మంచు తుపాను ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది.
‘ఇది చాలా హృదయవిదారకరంగా ఉంది. గత సంవత్సరమైతే ఈ పరిస్థితి కష్టమే. కానీ ఇప్పుడు మనకు నివారించే మార్గాలున్నాయి’ అని ఫిలడెల్ఫియాకు చెందిన చిన్నపిల్లల వైద్యుడు అభిప్రాయపడ్డారు. చిన్నారులకు టీకాలు అందించాల్సిన ఆవశ్యకతను నిపుణులు గుర్తుచేస్తున్నారు. డిసెంబర్ 22 నుంచి 28 వరకు ముగిసిన వారంలో రోజుకు సగటున 378 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు సీడీసీ గణాంకాలు వెల్లడించాయి. వారంతా 17 సంవత్సరాలు లేక ఆ కిందివయస్సు వారే. ఈ పెరుగుదల గత వారంతో పోల్చితే 66 శాతం అధికం కావడం గమనార్హం. సెప్టెంబర్లో కరోనా విజృంభించిన సమయంలో రోజుకు సగటున 342 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరారని తెలిపింది. అయితే మొత్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారితో పోలిస్తే.. పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. అదే వారంలో అన్ని వయస్సుల వారు రోజుకు సగటున 10,200 మంది ఆసుపత్రిలో చేరారు. అలాగే చిన్నారుల్లో లక్షణాలు కూడా తక్కువగానే ఉంటున్నట్లు వైద్యులు చెప్తున్నారు.
ఇదిలా ఉండగా.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలకు రోజూవారీ కార్యకలాపాల్లో అంతరాయం కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో వైరస్ మంచు తుపాను రాబోతుందని, దీని ద్వారా ప్రజలంతా ఒత్తిడికి గురికానున్నారని మిన్నెసోటాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ మైఖేల్ వ్యాఖ్యానించారు. వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..అమెరికాలో కొత్తగా 5,72,029 మందికి కరోనా సోకింది. 1,362 మంది మృతి చెందారు. మొత్తంగా 5,52,52,823 మంది మహమ్మారి బారినపడగా..8 లక్షకు పైగా మరణాలు సంభవించాయి.
ఐసోలేషన్ మార్గదర్శకాలు సవరించిన సీడీసీ..
కరోనా బాధితుల విషయంలో సీడీసీ ఐసోలేషన్ మార్గదర్శకాలను సవరించింది. లక్షణాలు కనిపించని బాధితులకు ఐసోలేషన్ సమయాన్ని ఐదు రోజులకు తగ్గించింది. వారికి ఐసోలేషన్ ముగించే ముందు 24 గంటల పాటు జ్వరం ఉండకూడదని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు మిగతా ఐదు రోజులు మాస్క్ ధరించాలని సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో 10 రోజుల ఐసోలేషన్ సమయాన్ని 5 రోజులకు తగ్గించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తాజాగా ఈ నిబంధనల్లో మార్పు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!