2021: ‘వ్యాక్సిన్లు, బూస్టర్లు, వేరియంట్లు’.. ఆశలతో మొదలై.. ఆందోళనతో ముగుస్తూ!
ఈ ఏడాది వ్యాక్సిన్ల ఆశలు, బూస్టర్లతో ప్రగతి సాధించినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న ఆందోళనకర వేరియంట్లు విసురుతున్న సవాళ్లతో ఏడాదికి ముగింపు పలుకుతూ కొత్త ఏడాదిలోకి ప్రపంచ దేశాలు అడుగుపెడుతున్నాయి.
ఎప్పటికప్పుడు సంసిద్ధతే ముఖ్యమంటున్న నిపుణులు
దిల్లీ: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏడాది పాటు ప్రపంచదేశాలు ఎదురుచూడాల్సి వచ్చింది. 2019 డిసెంబర్లో చైనాలో వెలుగు చూసిన ఈ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ ఏడాదిలోనే అందుబాటులోకి రావడంతో దేశాలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి. వైరస్కు ముగింపు పలకాలనే ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రపంచ దేశాలు.. కొవిడ్ను ఎదుర్కొనే వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో కొవిడ్ విజృంభణతో సతమతమవుతోన్న భారత్ కూడా జనవరి 16, 2021న వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించింది. ఇప్పటికే 90శాతం అర్హులకు కనీసం ఒక డోసు పంపిణీ చేసింది. అంతేకాకుండా ముందుజాగ్రత్తగా ఫ్రంట్లైన్ వర్కర్లకు ‘ప్రికాషన్ డోసు’ కూడా ఇస్తామని ప్రకటించింది. ఇలా ఈ ఏడాది వ్యాక్సిన్ల ఆశలు, బూస్టర్లతో ప్రగతి సాధించినప్పటికీ.. కొత్తగా వెలుగు చూస్తోన్న ఆందోళనకర వేరియంట్లు విసురుతున్న సవాళ్లతో ఏడాదికి ముగింపు పలుకుతూ కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాయి.
వ్యాక్సిన్లు..
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీ ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 900కోట్ల డోసులను అందించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటు భారత్లోనూ 143 కోట్ల డోసులను అందించారు. అయితే తొలుత వెలుగు చూసిన అల్ఫా, బీటా, గామా వంటి వేరియంట్లను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేశాయి. అనంతరం డెల్టా రూపంలో ఊహించని రీతిలో విరుచుకుపడిన మహమ్మారి భారత్తోపాటు పలు దేశాల్లో వేల మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్నిరోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ వేరియంట్ను నిరోధించడంలో వ్యాక్సిన్లు కాస్త తక్కువ సామర్థ్యాన్నే చూపించినట్లు వెల్లడైంది. అయినప్పటికీ తీవ్ర వ్యాధి, మరణం ముప్పు నుంచి వ్యాక్సిన్లు రక్షిస్తున్నట్లు తేలడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇదే సమయంలో కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో బూస్టర్ డోసుకు సిద్ధమయ్యాయి.
బూస్టర్లు..
ఇలా కొత్త వేరియంట్లు ముంచుకొస్తున్న వేళ ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ పంపిణీని ముమ్మరం చేశాయి. కొన్ని పేద దేశాలు మినహా చాలా దేశాల్లో సగం జనాభాకు పూర్తి మోతాదుల్లో వ్యాక్సిన్ పూర్తి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలు బూస్టర్ డోసుపై శ్రద్ధ పెట్టాయి. ఇప్పటికే అమెరికాలో అర్హులైన వారిలో 25శాతం మందికి మూడో డోసు అందించారు. ఇటు భారత్ కూడా ప్రికాషన్ డోసు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. మరో అడుగు ముందుకేసిన ఇజ్రాయెల్ మూడోడోసు పంపిణీని జూన్ నెలలోనే మొదలుపెట్టింది. ప్రస్తుతం నాలుగో డోసు పనితీరు ఫలితాలను విశ్లేషించే పనిలో పడింది. ఇలా ఈ ఏడాది బూస్టర్ డోసుపైనా ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.
కొత్త వేరియంట్ల సవాల్..
ఈ ఏడాది ప్రారంభంలో ఎలా విజృంభించిందో ప్రస్తుతం అదే రీతిలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ సత్యజిత్ రథ్ పేర్కొన్నారు. ఇలా ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు రావడం సహజమేనన్న ఆయన ఇన్ఫ్లుయెంజాను ఉదహరించారు. అందుకే ఈ మహమ్మారి ఒక్కసారిగా అంతమవుతుందని ఆశించడం వాస్తవం కాదని చెప్పడానికి కారణాల్లో ఇదొకటి అని పేర్కొన్నారు. ‘శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యే ఇతర వైరస్లకు సార్స్-కోవ్-2 ఎంత దగ్గరగా ఉందో మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం వైరస్ ప్రభావం, ఎదుర్కొనే భిన్న మార్గాలకు అర్థం చేసుకుంటున్నాం. ఇదే సమయంలో కొత్త వేరియంట్లు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి’ అని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్ మేనన్ పేర్కొన్నారు. ఇందులో భాగమే ‘ఈ ఒమిక్రాన్ వేరియంట్ ట్విస్ట్’ అని అభిప్రాయపడ్డారు.
ఇలా వైరస్ మ్యుటేషన్ చెందడం కొనసాగుతూనే ఉంటుందని.. వాటిలో కొన్ని వేగంగా వ్యాప్తిచెందేవి ఉంటే, యాంటీబాడీలను ఏమార్చేవి మరికొన్ని ఉంటాయని కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయోలజీకి చెందిన వైరాలజిస్ట్ ఉపాసనా రాయ్ పేర్కొన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్లతో పాటు ఇదివరకు ఇన్ఫెక్షన్ వల్ల పొందిన యాంటీబాడీలతో రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.
రోగనిరోధక శక్తిని ఏమార్చుతూ, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ వంటి వేరియంట్లు మరిన్ని సాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ను ఎదుర్కోవడం, కొత్త వ్యాక్సిన్లు రూపొందించడం, చికిత్సా పద్ధతులపైనే వచ్చే ఏడాది ప్రధాన దృష్టి ఉంటుందని చెబుతున్నారు. యాంటీబాడీలను ఏమార్చే వేరియంట్లను నిరోధించాలంటే ముందుగా వైరస్ వ్యాప్తి గొలుసుకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం సాధ్యమైంత త్వరగా వైరస్ గుర్తింపు, బాధితుల ఐసోలేషన్తోపాటు వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్ అందినప్పుడే వైరస్ ముప్పు తొలగిపోతుందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్