Omicron: ఒమిక్రాన్పై టీకాలు పనిచేస్తాయా? బయోఎన్టెక్ సీఈఓ ఏమన్నారంటే..
కొత్త వేరియంట్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థ బయోఎన్టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. దీనిపై ఇంకా సమగ్ర సమాచారం లేకపోవడంతో అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వేరియంట్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ల సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థ బయోఎన్టెక్ సీఈఓ ఉగుర్ సాహిన్ కొంత ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు.. ఒమిక్రాన్ సోకిన వారిని తీవ్రమైన వ్యాధి లక్షణాల నుంచి కాపాడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎక్కువ మొత్తంలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్న కొత్త వేరియంట్ వల్ల టీకా వేసుకున్న వారిలోనూ ఎక్కువ కేసులు బయటపడొచ్చని సాహిన్ తెలిపారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడే ప్రతిరోధకాల నుంచి ఈ వేరియంట్ తప్పించుకోగలిగే అవకాశం కూడా ఉండొచ్చన్నారు. అయినప్పటికీ టీకా వల్ల వచ్చిన రోగనిరోధకత దాన్ని అడ్డుకోగలుగుతుందని వివరించారు. అయితే, నిరాశ చెందాల్సిన అవసరం లేదని.. బూస్టర్ డోసును వేగవంతం చేయాలని సూచించారు. ఫైజర్తో కలిసి బయోఎన్టెక్ కరోనా టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ప్రధానంగా పంపిణీ చేస్తున్న టీకాల్లో ఇదొకటి.
భిన్న వాదనలు..
ఒమిక్రాన్పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సాహిన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం కొంత ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. మరో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా సీఈఓ స్టీఫన్ బ్యాన్సెల్ మంగళవారం మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కోసం కొత్త టీకాను అభివృద్ధి చేయాల్సి రావొచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో నిన్న ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇక ఆస్ట్రాజెనెకాతో కలిసి కొవిడ్ టీకా అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్ వర్గాలు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న టీకాలు ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించాయి.
మరో రెండు వారాలు గడిస్తే ఒమిక్రాన్పై పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని చెప్పలేమంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అయితే, ప్రస్తుతం ఉన్న టీకాలు దీని నుంచి కొంత వరకైనా రక్షణ కల్పిస్తాయని తమ వైద్య బృందం భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర సమాచారం మరికొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఒమిక్రాన్ కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్లు తయారు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కొత్త టీకాల అవసరం ఏర్పడితే.. వాటి అత్యవసర వినియోగ అనుమతికి కావాల్సిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ మంగళవారం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్