Corona: యూఎస్,యూకేల్లో లక్షల్లో కొత్త కేసులు.. ‘డెల్మిక్రాన్’ కారణమా..?
కరోనావైరస్ ధాటికి బిట్రన్ విలవిలలాడుతోంది. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడైంది. దాంతో వరుసగా రెండోరోజు లక్షకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి.
ఇంటర్నెట్ డెస్క్: కరోనావైరస్ ధాటికి బిట్రన్ విలవిలలాడుతోంది. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోడైంది. దాంతో వరుసగా రెండోరోజు లక్షకు పైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. తాజాగా 1,19,789 మందికి వైరస్ సోకింది. ఒమిక్రాన్ వేళ.. అక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 1,47,720 మరణాలు సంభవించాయి.
అమెరికాలో కరోనా కొత్త కేసులు రెండు లక్షల మార్కును దాటాయి. తాజాగా 2,65,032 మందికి కొవిడ్ సోకింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో కేసులు వెలుగుచేశాయి. మొత్తంగా 5 కోట్లమందికి పైగా కొవిడ్ బారినపడగా.. 8లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఆ దేశంలో డెల్టా వేరియంట్ బాధితుల సంఖ్య 27 శాతానికి తగ్గగా.. ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య 73 శాతానికి పెరిగినట్లు ఇటీవల సీడీసీ వెల్లడించింది. ఈ రెండే కాకుండా ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, కెనడాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ తాజా వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉందని నిపుణులు వాదన వినిపిస్తున్నారు.
ఏమిటీ డెల్మిక్రాన్..
డెల్టా+ఒమిక్రాన్ను ఉద్దేశించి డెల్మిక్రాన్గా పిలుస్తున్నారు. ఇదేమీ కొత్త వేరియంట్ కానప్పటికీ.. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల కలయికగా నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో డెల్టాతో పాటు ఒమిక్రాన్ కూడా సోకితే డెల్మిక్రాన్గా పరిగణిస్తారు. అలాగే డెల్టా నుంచి కోలుకుంటున్న వ్యక్తికి .. మరో వేరియంట్ ఒమిక్రాన్ సోకితే డెల్మిక్రాన్ ఇన్ఫెక్షన్గా చెబుతారు. ఇది చాలా అరుదుగా జరగొచ్చని నిపుణులు అంటున్నారు. ఒకటి కంటే ఎక్కువ కరోనా వైరస్ వేరియంట్ల బారినపడిన జన సమూహానికి సన్నిహితంగా వెళ్లిన సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తొచ్చని అంచనా వేస్తున్నారు.
లక్షణాల సంగతేంటి..?
ఈ తరహా బాధితుల్లో లక్షణాల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు డెల్టా, ఒమిక్రాన్ బారినపడిన వ్యక్తుల్లో కాస్త అటూఇటుగా ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటివి వస్తున్నాయి. కాగా, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. డెల్టా కంటే ఒమిక్రాన్తో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయి. కానీ, బలహీన రోగనిరోధక శక్తి, వృద్ధాప్యం, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారికి ఈ డబుల్ ఇన్ఫెక్షన్తో ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా కొవిడ్ నియమావళిని పాటించడం, టీకాలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు.
భారత్లో ఈ ప్రస్తావన ఉందా..?
ఇక, డెల్టా వేరియంట్ డామినెంట్గా ఉన్న భారత్లో.. ఒమిక్రాన్ క్రమంగా విస్తరిస్తోంది. 350 మందికి పైగా దీని బారినపడ్డారు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ కేసులు తక్కువగానే ఉన్నాయి. అందువల్ల డెల్మిక్రాన్ విషయంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఇప్పటివరకు కొవిడ్ టాస్క్ ఫోర్స్, ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్