Gangster: 15 ఏళ్ల తర్వాత భారత్కు చిక్కిన మోస్ట్వాంటెడ్ గ్యాంగ్స్టర్
మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దోపిడీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్.. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ సురేశ్ పూజారిని అధికారులు భారత్కు రప్పించారు......
ముంబయి: మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దోపిడీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్.. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ సురేశ్ పూజారిని అధికారులు భారత్కు రప్పించారు. ఫిలిప్పీన్స్ నుంచి మంగళవారం రాత్రి భారత్కు తీసుకొచ్చినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) పూజారిని బుధవారం దిల్లీలో తమ కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం పలు కేసుల్లో విచారణ నిమిత్తం ముంబయికి తరలించినట్లు తెలిపారు.
మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్ నుంచి దిల్లీకి తీసుకొచ్చిన తర్వాత తొలుత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), సీబీఐ అధికారులు సురేశ్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే దిల్లీ చేరుకున్న డీసీపీ రాజ్కుమార్ శిండే నేతృత్వంలోని ఏటీఎస్ బృందం.. అతడిని కస్టడీలోకి తీసుకుని బుధవారం ఉదయం వాయుమార్గంలో ముంబయికి తీసుకొచ్చింది. అనంతరం కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరినట్లు తెలిపారు. ఏటీఎస్ కస్టడీ పూర్తయ్యాక రాష్ట్ర రాజధానిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ముంబయి, ఠాణె, కల్యాణ్, ఉల్హాస్నగర్, దోంబివలిలో నమోదైన పలు దోపిడీ కేసుల్లో పూజారి మోస్ట్వాంటెడ్. ఈ క్రమంలోనే ముంబయి, ఠాణె పోలీసులు 2017, 2018 రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. ఒక్క ఠాణె, ముంబయి పోలీసుస్టేషన్లతో పాటు కేవలం మహారాష్ట్రలోనే అతడిపై 24 కేసులు నమోదయ్యాయి. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న పూజారిని గత అక్టోబర్లో ఫిలిప్పీన్స్లోని భారత అధికారులు పట్టుకున్నారు. పూజారికి గ్యాంగ్స్టర్ రవి అత్యంత దగ్గరి బంధువు. అండర్వరల్డ్ డాన్ చోటా రాజన్తోనూ పూజారి పనిచేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో