World's Smallest Baby: 13 నెలలకు ఇంటికి చేరిన ‘యాపిల్’ బేబీ
తల్లి గర్భం నుంచి 25 వారాలకే భూమ్మీదకొచ్చిన ఆ చిన్నారి బరువు 212 గ్రాములే. అది ఒక యాపిల్ బరువంత. పొడవు కేవలం 24 సెంటీమీటర్లు. అంత ‘చిన్న’ పాప ప్రాణం నిలపడం, ఈ పరిస్థితులకు తట్టుకునేలా చూసుకోవడం వైద్యులకు సవాలు మారిన క్షణమది. గతేడాది జూన్ నుంచి 13 నెలలుగా ఆ చిన్నారి ‘యాపిల్’ను కంటికి రెప్పలా కాచారు. ఎదిగిన ఆ పాపను ఇటీవలే ఇంటికి పంపారు. ఆ పాప పుట్టుక నుంచి ఇంటికి వెళ్లిన క్రమాన్ని సింగపూర్కు చెందిన నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ ఫేస్బుక్లో వెల్లడించింది.
సింగపూర్: తల్లి గర్భం నుంచి 25 వారాలకే భూమ్మీదకొచ్చిన ఆ చిన్నారి బరువు 212 గ్రాములే. అది ఒక యాపిల్ బరువంత. పొడవు కేవలం 24 సెంటీమీటర్లు. అంత ‘చిన్న’ పాప ప్రాణం నిలపడం, ఈ పరిస్థితులకు తట్టుకునేలా చూసుకోవడం వైద్యులకు సవాలు మారిన క్షణమది. గతేడాది జూన్ నుంచి 13 నెలలుగా ఆ చిన్నారి ‘యాపిల్’ను కంటికి రెప్పలా కాచారు. ఎదిగిన ఆ పాపను ఇటీవలే ఇంటికి పంపారు. ఆ పాప పుట్టుక నుంచి ఇంటికి వెళ్లిన క్రమాన్ని సింగపూర్కు చెందిన నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ ఫేస్బుక్లో వెల్లడించింది.
గత ఏడాది జూన్ 9న సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ (ఎన్యూహెచ్)లో క్వెక్ యూ గ్జాన్ జన్మించింది. నెలలు నిండకముందే 25 వారాలకే ఈ భూమ్మీదకు వచ్చింది. అప్పుడు ఆ శిశువు బరువు 212 గ్రాములు మాత్రమే ఉంది. అది ఒక యాపిల్ బరువంత. తర్వాత చికిత్స నిమిత్తం ఆ బిడ్డను నియోనాటల్ కేంద్రానికి తరలించారు. ఆ శిశువును చూసి, అక్కడి నర్స్ ఆశ్చర్యపోయారు. తనను కళ్లను తానే నమ్మలేకపోయానని చెప్పారు. ‘నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యాను. వెంటనే మా ప్రొఫెసర్కు ఈ విషయం చెప్పడానికి పరిగెత్తాను. నా 22 సంవత్సరాల వృత్తి జీవితంలో అంత చిన్నగా ఉన్న శిశువును చూడలేదు’ అంటూ ఆ నర్సు మీడియాకు వెల్లడించారు.
గత జూన్ నుంచి 13 నెలల పాటు క్వెక్కు చికిత్స అందించగా.. అందులో కొన్ని వారాల పాటు వెంటిలేటర్పైనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారి 6.3 కేజీలకు చేరుకుంది. అయితే ఈ క్రమంలో వైద్యులు చికిత్స అందించేప్పుడు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆమె పుట్టినప్పుడు కనీసం 400 నుంచి 600 గ్రాములవరకు ఉంటుందని వైద్యులు భావించారు. కానీ బరువు తక్కువగా పుట్టడంతో ఆమె సైజ్కు తగ్గట్టుగా అన్నింటినీ తగ్గించాల్సి వచ్చింది. ఆమెకు కృత్రిమ శ్వాస అందించడం కోసం ట్యూబ్, మందుల పరిమాణం తగ్గించారు. డైపర్లను కత్తిరించాల్సి వచ్చింది. ఆమె చర్మం పెళుసుగా ఉండటంతో చికిత్స సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది. వీటన్నింటి మధ్య క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకొని ఆ శిశువు ఎదగడం చూసి, తమ కష్టమంతా మర్చిపోయామన్నారు. ఈ కరోనా వేళ ఆమె ఒక ఆశాకిరణంలా నిలిచిందని ఆసుపత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ప్రపంచంలోనే అతి తక్కువ బరువుతో నెలలు నిండకముందే జన్మించి, జీవించి ఉన్న పాప ఈమేనని వైద్యులు భావిస్తున్నారు. ఇంతకు ముందు 2018లో అమెరికాలో జన్మించిన బేబీ బరువు 245 గ్రాములు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి చిన్నారి ఇంటికి చేరినప్పటికీ, ఇంకా వైద్యం కొనసాగించాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగా ఆమె తల్లిదండ్రుల్ని వైద్యులు సిద్ధం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్