Temjen Imna Along: ఫుడ్ గురించి పోస్టు.. నేను సైలెంట్గా ఎలా ఉంటా..?
నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ అలోంగ్(Temjen Imna Along) నెట్టింట్లో చెప్పే మాటలు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఆయన పానీపూరీ గురించి పోస్టు పెట్టారు.
దిల్లీ: స్ట్రీట్ ఫుడ్కు ఉండే టేస్టే వేరు. భారత్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారం లభిస్తుంటుంది. అయితే పానీపూరీ మాత్రం భారతీయులందరికీ ఫేవరెట్. తాజాగా భారత్లో పర్యటించిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిద (Fumio Kishida)కూడా దాని రుచికి ఫిదా అయ్యారు. ఆయన పానీపూరీ తింటున్న దృశ్యాలను ప్రధాని మోదీ ట్విటర్లో షేర్ చేశారు. ఇప్పుడు దానిపై నాగాలాండ్ భాజపా నేత తెమ్జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along) స్పందించారు.
‘ఆహారం గురించి ఏదైనా పోస్టు కనిపించినప్పుడు నేను స్పందించకుండా ఎలా ఉంటాను..? జపాన్ ప్రధాని కూడా అందరిని కట్టిపడేసే పానీపూరీని రుచి చూడకుండా ఉండలేకపోయారు. గురూజీ(మోదీని ఉద్దేశించి) స్టైలే వేరు’ అంటూ జపాన్ ప్రధాని పానీపూరీ తింటున్న వీడియోను షేర్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.