Jammu Kashmir: కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఆర్మీ అధికారి వీర మరణం
కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. రాజౌరి జిల్లాలోని ఠాణామండీ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీవో) అమరుడయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి...
మరొకరికి గాయాలు, ఒక ఉగ్రవాది హతం
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగారు. రాజౌరి జిల్లాలోని ఠాణామండీ ప్రాంతంలో గురువారం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీవో) అమరుడయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది సైతం హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ‘ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతాదళాలు బుధవారం కార్డన్ సెర్చ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్యోట్ కలాస్ ప్రాంతంలో వారు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఫైరింగ్ మొదలైందని’ని వివరించారు. ఉగ్రవాదులంతా నియంత్రణ రేఖ దాటి ఈ ప్రాంతంలోకి చొరబడ్డారని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఎంతమంది వచ్చారో తెలియదని, ఎన్కౌంటర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. కొన్ని వారాలుగా రాజౌరి సెక్టార్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆగస్టు 6న సైతం ఈ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?