6 గంటలు నిలబడి ఓటేస్తే అరెస్టు చేశారు!
ఎన్నికల్లో భాగంగా నిర్వహించే పోలింగ్లో పాల్గొని ఓటు వేయడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. ఎన్ని వసతులు కల్పించినా.. గంటలకొద్ది క్యూలో నిలబడి ఓటు వేయాలా? అంత ఓపిక నాకు లేదు.. నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం కాదులే అని రాజ్యాంగం కల్పించిన ఓటు
వాషింగ్టన్: ఎన్నికల్లో భాగంగా నిర్వహించే పోలింగ్లో పాల్గొని ఓటు వేయడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. ఎన్ని ఏర్పాట్లు,, వసతులు కల్పించినా.. గంటలకొద్ది క్యూలో నిలబడి ఓటు వేయాలా? అంత ఓపిక నాకు లేదు.. నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం కాదులే అని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పట్టించుకోరు. కానీ, టెక్సాస్కు చెందిన హెర్విస్ రోగర్స్ అనే వ్యక్తి గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో తన వంతు బాధ్యతగా చక్కగా ఓటు హక్కు వినియోగించుకున్నాడు. పౌరుడిగా అది తన కర్తవ్యమని భావించాడు.. కానీ, అతడు వేసిన ఓట్లు చట్టవిరుద్ధమని ఇటీవల తేలింది. దీంతో 62 ఏళ్ల ఆ వ్యక్తికి 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో గతేడాదంతా దేశాధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో యూఎస్లోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు విడతల వారీగా ఓట్లు వేశారు. ఆ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ గెలుపొందింది. అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భాగంగా గతేడాది మార్చిలో హెర్విస్ రోగర్స్ ఆరు గంటలు క్యూలో నిల్చుని మరి ఓటు వేశాడు. దీంతో అతడి అంకితభావానికి అందరూ మెచ్చుకున్నారు. మీడియా అతడి గురించి కథనాలు రాయడంతో స్థానికంగా పాపులరయ్యాడు. అయితే, ఇటీవల అతడు వేసిన ఓటు చట్టవిరుద్ధమని పోలీసులు గుర్తించారు. స్థానిక చట్టాల ప్రకారం నేరాలకు పాల్పడి జైలు శిక్షపడ్డ వ్యక్తులు ఓటు వేయడానికి అనర్హులు. కాగా.. 20 ఏళ్ల కిందట హెర్విస్ రెండు నేరాలు చేసి జైలుకెళ్లాడు. ప్రస్తుతం పెరోల్పై బయట ఉంటున్నాడు. నేరస్థులు ఓటు వేయడానికి అనర్హులనే విషయం తెలియక హెర్విస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడట. 2018లో జరిగిన మద్యంతర ఎన్నికలోనూ హెర్విస్ ఓటు వేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రెండుసార్లు చట్టవిరుద్ధంగా ఓటు వేసిన హెర్విస్కు నేరానికి 20ఏళ్ల చొప్పున మొత్తం రెండు నేరాలకు కలిపి 40ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందట.
ప్రస్తుతం ఈ కేసుపై కోర్టు విచారణ జరుపుతోంది. హెర్విస్కు తను ఓటు వేయడానికి అనర్హుడనే విషయం తెలియక ఓటు వేశాడని అతడి తరఫు న్యాయవాది టెక్సాస్ అటార్నీ అండ్రీ సెగురా వెల్లడించారు. చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేయడం తగదన్నారు. హెర్విస్ను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.