పర్యాటకులకు చెత్త పంపుతున్న థాయ్లాండ్
ఎక్కడైనా పర్యటనలకు వెళ్లి వస్తే మనతోపాటు అక్కడ గడిపిన జ్ఞాపకాలు, మధుర స్మృతులు వెంట వస్తాయి. కానీ, ఇకపై థాయ్లాండ్లోని ఓ జాతీయ పార్కును సందర్శిస్తే మాత్రం మీరు అక్కడ పడేసిన చెత్త వెంట రాబోతుంది. విచిత్రంగా ఉంది కదా..! నిజమేనండీ..
ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడైనా పర్యటనలకు వెళ్లి వస్తే మనతోపాటు అక్కడ గడిపిన జ్ఞాపకాలు, మధుర స్మృతులు వెంట వస్తాయి. కానీ, ఇకపై థాయ్లాండ్లోని ఓ జాతీయ పార్కును సందర్శిస్తే మాత్రం మీరు అక్కడ పడేసిన చెత్త మీ వెంట వస్తుంది. విచిత్రంగా ఉంది కదా..! నిజమేనండీ.. ఆ పార్క్లో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేసే పర్యాటకులకు బుద్ధి చెప్పాలని, పర్యావరణాన్ని కాపాడాలని థాయ్లాండ్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.
థాయ్లాండ్లోని కవో యాయ్ జాతీయ పార్కు, ఆ దేశంలో చూడాల్సిన సందర్శక ప్రాంతాల్లో ఇదీ ఒకటి. ఇక్కడికి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ పార్క్లో వాటర్ఫాల్స్, ట్రెక్కింగ్ వంటివి ఆకట్టుకుంటాయి. పర్యాటకులు ఇక్కడ సమయం గడపడం కోసం టెంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే కొందరు పర్యాటకులు ఈ టెంట్లలో గడిపి.. తిను బండారాల ప్యాకెట్లు, నీరు.. కూల్డ్రింక్స్ బాటిళ్లు తదితర చెత్తను తీసేయకుండా అక్కడే పడేసి వెళ్తున్నారట. పరిశుభ్రతపై కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించే పర్యాటకులకు బుద్ధి చెప్పాలని అక్కడి ప్రభుత్వం, పార్క్ యాజమాన్యం భావించింది. దీంతో ఇకపై పర్యాటకులు చెత్తను నిర్దేశించిన ప్రాంతంలో పడేయకుండా టెంట్లు, పార్కులో పడేస్తే.. టెంట్లు బుక్ చేసుకునే సమయంలో ఇచ్చిన చిరునామా ఆధారంగా వారు వదిలేసిన చెత్తను పార్శిల్ చేసి వారికే పంపిస్తారట. ఈ మేరకు ఆ దేశ పర్యావరణశాఖ మంత్రి వరావుత్ సిల్పా ఇటీవల సోషల్మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఆ పనులు ప్రారంభమయ్యాయని కొందరు పర్యటకులకు వారు వేసిన చెత్తను పార్శిల్ చేసి పంపిస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
డీప్ఫేక్ ఉచ్చులో ప్రియాంకా చోప్రా
డీప్ఫేక్ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. -
గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
భారత పార్లమెంటుపై దాడి చేస్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. -
మెహుల్ చోక్సీ దంపతులపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పరారైన వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి
అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్లో అసంబద్ధ విధానాలు
సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్కు మారుస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. -
యునెస్కో జాబితాలో గర్బా నృత్యం
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. -
100కు పైగా మోసకారి వెబ్సైట్ల మూసివేత
చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. -
అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు 7వేల మందికి ఆహ్వానం
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది. -
అంబేడ్కర్కు ప్రధాని ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షిప్త వార్తలు
చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు. -
వరద నుంచి తేరుకోని చెన్నై
మిగ్జాం తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సమస్య ఉన్న చోట నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, గ్రేటర్ కార్పొరేషన్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Ratan Tata: రిస్క్లేని పెట్టుబడి అంటూ.. రతన్ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాలో పోస్టు
రతన్ టాటా మాట్లాడినట్లు ఓ నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాగ్రామ్లో వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం