ఉద్ధవ్ ఠాక్రేకు చుక్కెదురు.. 66మంది కార్పొరేటర్లు శిందే క్యాంపులోకి జంప్
శివసేన (Shiv Sena) రెబల్ నేతల తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) మరోసారి చుక్కెదురయ్యింది.
ముంబయి: శివసేన (Shiv Sena) రెబల్ నేతల కారణంగా అధికారం కోల్పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) మరోసారి చుక్కెదురయ్యింది. ఠాణె మున్సిపల్ కార్పొరేషన్కు (TMC)కి చెందిన 66మంది శివసేన కార్పొరేటర్లు శిందే గూటికి చేరిపోయారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde)ను బుధవారం రాత్రి కలిసిన శివసేన రెబల్ కార్పొరేటర్లు.. ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు సీఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో ఉద్ధవ్ వర్గంలో కేవలం ఒక్క కార్పొరేటర్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. బీఎంసీ (బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్) తర్వాత అతి కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ ఠాణెనే కావడంతో ఉద్ధవ్ పార్టీ అక్కడ పట్టు కోల్పోతున్నట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉద్ధవ్ఠాక్రే నేతృత్వంలోని శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే వర్గం.. భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు శిందేకు తోడుగా నిలవడంతో ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఆయనకు తేలికయ్యింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ తమదే అసలైన శివసేన అంటూ ఇరువర్గాలు పేర్కొనడం గమనార్హం. పార్టీ గుర్తు తమదేనంటూ ప్రకటించుకుంటున్నాయి. మరోవైపు పార్టీకి ప్రస్తుతం లోక్సభలో 18 మంది ఉండగా.. అందులో 12 మంది తమవైపే ఉన్నట్లు శివసేన రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ చెబుతున్నారు. ఇలా మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ తాజా పరిణామాలు ఉద్ధవ్ ఠాక్రేకు మరింత సవాలుగా మారినట్లు కనిపిస్తున్నాయి.
ఇదిలాఉంటే 2017లో శివసేన తరపున ఠాణె మున్సిపల్ కార్పొరేటర్లుగా ఎన్నికైన వీరి పదవీకాలం ఇప్పటికే ముగిసింది. అయితే, టీఎంసీ ఎన్నికలు ఈ ఏడాది మొదట్లోనే జరగాల్సి ఉన్నప్పటికీ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. ఈ సమయంలోనే ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.