Afghanistan: అల్విదా అఫ్గాన్.. కాబుల్ను వీడిన చిట్టచివరి అమెరికా సైనికుడితడే..
ఉగ్రవాదంపై పోరులో 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గాన్ గడ్డ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగింది. సోమవారం అర్ధరాత్రికి ఒక నిమిషం ముందు
కాబుల్: ఉగ్రవాదంపై పోరులో 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గాన్ గడ్డ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగింది. సోమవారం అర్ధరాత్రికి ఒక నిమిషం ముందు కాబుల్ ఎయిర్పోర్టు నుంచి యూఎస్ రక్షణ దళాలతో కూడిన చివరి విమానం బయల్దేరింది. అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే అమెరికా దళాలు అఫ్గాన్ను వీడాయి. దీంతో రెండు దశాబ్దాల యుద్ధానికి సంపూర్ణ ముగింపు పలికినట్లయింది. అఫ్గాన్ వీడుతున్న చిట్టచివరి సైనికుడి ఫొటోను అమెరికా విడుదల చేసింది. వియత్నాం యుద్ధానికి, అఫ్గాన్ యుద్ధానికి దాదాపు చాలా పోలికలున్నాయి. ఈ క్రమంలో వియత్నాం యుద్ధంలో చిట్టచివరి వ్యక్తి కూడా అఫ్గాన్ యుద్ధంలో భాగమవ్వడం గమనార్హం.
చివరి సైనికుడు.. కమాండర్ డోనాహువే
అఫ్గానిస్థాన్ను వీడిన చిట్టచివరి అమెరికా సైనికుడు మేజర్ జనరల్ క్రిస్ డోనాహువే. సోమవారం అర్ధరాత్రి కాబుల్ నుంచి బయల్దేరిన సీ-17 విమానంలోకి చివరగా ఎక్కింది ఈయనే. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ట్విటర్ వేదికగా ప్రకటిస్తూ మేజర్ జనరల్ విమానం వద్దకు వస్తోన్న ఫొటోను విడుదల చేసింది. మేజర్ జనరల్ డోనాహువే.. 82వ ఎయిర్బోర్న్ డివిజన్లో కమాండర్గా పనిచేస్తున్నారు. కాబుల్లో అమెరికా మిషన్ను ముగించుకుని చివరగా ఆయన విమానమెక్కారు. ఇదే విమానంలో అఫ్గాన్కు అమెరికా రాయబారి రాస్ విల్సన్ కూడా ఉన్నారు. మేజర్ జనరల్ గతేడాదే ఎయిర్బోర్న్ డివిజన్ కమాండర్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కంబైన్డ్ జాయింట్ స్పెషల్ ఆపరేషన్ టాస్క్ఫోర్స్ కమాండర్గా పనిచేశారు.
తాలిబన్ కమాండర్తో మాట్లాడి..
అమెరికా బయల్దేరడానికి ముందు మేజర్ జనరల్ డోనాహువే.. కాబుల్ ఎయిర్పోర్టు వద్ద ఉన్న తాలిబన్ కమాండర్తో మాట్లాడారని యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మెకంజీ తెలిపారు. అమెరికా దళాలు అఫ్గాన్ను వీడుతున్నట్లు డోనాహువే తాలిబన్లకు చెప్పినట్లు పేర్కొన్నారు.
15రోజుల్లో 1.23లక్షల మందిని తరలించి..
తాలిబన్లు కాబుల్ను హస్తగతం చేసుకోవడంతో ఆ దేశ పౌరులు విమానాశ్రయానికి పోటెత్తారు. దీంతో అమెరికా.. వారిని అక్కడి నుంచి మరో దేశానికి తరలించింది. ఆగస్టు 14 నుంచి దాదాపు 1.23లక్షల మంది అఫ్గాన్ వాసులను తరలించినట్లు జనరల్ మెకంజీ వెల్లడించారు. అమెరికా చరిత్రలోనే ఇదే అతిపెద్ద తరలింపు ప్రక్రియ అని తెలిపారు.
చివరి రోజుల్లో ఉద్రిక్తత..
గడిచిన వారం రోజుల్లో కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్టు గేటు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అగ్రరాజ్యం.. విమానాశ్రయం వద్ద నిఘా పెంచింది. ముష్కరులు ప్రయోగించిన రాకెట్లను తిప్పికొట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అత్యంత భద్రత నడుమ చిట్టచివరి విమానం కాబుల్ నుంచి బయల్దేరింది. అయితే అమెరికా సైన్యం తరలింపు పూర్తయినప్పటికీ.. దౌత్యపరమైన మిషన్ కొనసాగుతుందని జనరల్ మెకంజీ తెలిపారు. అఫ్గాన్ వీడాలనుకునే ఆ దేశ పౌరులు, అమెరికా దేశస్థులను తరలిస్తామని వెల్లడించారు.
వియత్నాం యుద్ధంలో ఆయన..
వియత్నాంలో యుద్ధంలో జేమ్స్ ఎర్లె పార్కర్ అనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారి పేరు చివరిసారి వియత్నాంను వీడిన అమెరికా అధికారిగా నిలిచిపోయింది. మరో విశేషం ఏమిటంటే వియత్నాంను ఆక్రమించడానికి 1965లో వెళ్లిన తొలినాటి అమెరికా ఇన్ఫాంట్రి దళాల్లో ఆయన సభ్యుడు. చిట్ట చివర వియత్నాంను వీడింది కూడా ఆయనే. సీఐఏ కోవర్ట్ ఆపరేషన్లకు 34ఏళ్లపాటు తన సేవలను అందించాడు. దక్షిణ వియత్నాం రాజధాని సైగాన్ను ఉత్తర వియత్నాం దళాలు ఆక్రమించుకొన్న రెండు రోజుల తర్వాత పార్కర్ డెల్టా అనే నదీ మార్గంలో ఓ పడవపై తప్పించుకొన్నారు. 1992లో ఆయన సీఐఏ నుంచి రిటైర్ అయ్యారు. కానీ, 2001లో 9/11 దాడుల దర్యాప్తు కోసం తిరిగి సీఐఏలో చేరారు. తర్వాత 11 ఏళ్లపాటు అమెరికా ఆర్మీ స్పెషల్ ఫోర్స్, నేవీ సీల్స్ బృందాల కోసం పనిచేశారు. 2012లో రిటైర్ అయ్యారు. 2018లో క్యాన్సర్తో పోరాడుతూ లాస్ వేగాస్లో మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి