Anand Mahindra: సోప్ లిక్విడ్తో ట్రెడ్ మిల్.. అవార్డు నీకే అంటూ మహీంద్రా ట్వీట్
నిత్యం సరికొత్త సందేశాలను షేర్ చేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). తాజాగా ఆయన చేసిన పోస్టు ఆకట్టుకుంటోంది.
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) చేసే పోస్టుల్లో హాస్యానికి కొదవుండదు. స్ఫూర్తి నింపే సందేశాలకు లోటుండదు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో కూడా ఆ తరహాలోనిదే. అందుబాటులో సౌకర్యాలు లేవని చింతించకుండా ఓ యువకుడు చేసిన ఆలోచన ఆశ్చర్యపరుస్తోంది.
ఈ వీడియోలో యువకుడు వ్యాయామం చేయాలనే ఆలోచనను విరమించుకోకుండా.. సరికొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిమిషాల వ్యవధిలో ట్రెడ్మిల్(Tread mill)ను రూపొందించుకున్నాడు. వంటగదిలోకి వెళ్లి.. కొంచెం సోప్ లిక్విడ్ తీసుకొని నేలపై వేశాడు. తర్వాత దానిపై నీళ్లు చల్లి, కావాల్సినంత మేర ఆ ప్రాంతంలో కాలుతో స్ప్రెడ్ చేశాడు. ఇక అక్కడ కబోర్డులను హ్యాండిల్ మానిటర్లా ఉపయోగించుకున్నాడు. నిజంగానే ట్రెడ్మిల్లుపై ఉన్నట్లు తన కావాల్సిన వేగాన్ని సెట్ చేసుకుంటూ వ్యాయామాన్ని కొనసాగించాడు. ఈ వినూత్న ప్రయత్నం మహీంద్రాను మెప్పించింది. ‘ప్రపంచంలోనే అత్యంత చౌకైన ట్రెడ్మిల్ ఇది. అలాగే ఈ ఏడాది ఇన్నోవేషన్ అవార్డు ఇతడికే’ అంటూ వ్యాఖ్యను జోడించారు.
అయితే దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘ట్రెడ్మిల్ మీద రన్నింగ్ మొదలు పెట్టాడు. మరి ఆపేదెలా..?’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది ప్రమాదకర ప్రయత్నంలా ఉందని మరొకరు రాసుకొచ్చారు. ఎంతైనా వ్యాయామాల విషయంలో నిపుణుల సలహా తీసుకుంటే మంచిదని మరికొందరు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!