Modi: అదే.. భారత్ను ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా నిలిపింది: మోదీ
కరోనా సమయంలో భారత ఫార్మసీ రంగం మరింత అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా తొలినాళ్లలో భారత్ 150 దేశాలకు వివిధ ఔషధాలు, వైద్య పరికరాలను ఎగుమతి చేసిందని, ఈ ఏడాది 100 దేశాలకు 65 మిలియన్ కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. దిల్లీలో నిర్వహించిన
దిల్లీ: కరోనా సంక్షోభంలో ఎదురైన సవాళ్లను అధిగమించి భారత ఫార్మసీ రంగం మరింత అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కరోనా తొలినాళ్లలో భారత్ 150 దేశాలకు వివిధ ఔషధాలు, వైద్య పరికరాలను ఎగుమతి చేసిందని, ఈ ఏడాది 100 దేశాలకు 65 మిలియన్ కొవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిందని గుర్తు చేశారు. దిల్లీలో నిర్వహించిన తొలి ‘గ్లోబల్ ఇన్నోవేషన్ సమిట్’లో పాల్గొన్న మోదీ.. ఫార్మా, ఆరోగ్య రంగాలపై ప్రసంగించారు. భారత ఆరోగ్య రంగం.. ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొందని, అందుకే భారత్.. ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా నిలిచిందని చెప్పారు.
‘‘భారత్లో అందుబాటు ధరలోనే నాణ్యమైన ఔషధాలను భారీస్థాయిలో ఉత్పత్తి చేయగలం. అదే ప్రపంచమంతా భారత్వైపు చూసేలా చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు భారత ఆరోగ్య రంగం 12 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను సాధించింది’’అని ప్రధాని తెలిపారు. ఫార్మా పరిశ్రమను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దేశంలో చాలా మంది ఉన్నారని.. ఔషధాలు, వైద్య పరికరాల ఆవిష్కరణలో భారత్ను అగ్రగామీగా నిలిపేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!