అంబాలా.. ఆ బంగారు బాణాల కథేంటి..?
వాయుసేనలో బంగారం బాణాలకు ప్రత్యేకం స్థానం ఉంది. 17వ స్క్వాడ్రన్ ముద్దుగా గోల్డెన్ యారోస్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్లే ఈ స్క్వాడ్రన్ తురుపుమక్క . అత్యంత కఠినమైన ఆపరేషన్లను మొత్తం ఈ స్క్వాడ్రనే చూసుకొంటుంది.
రఫేల్ రాకకు కారణాలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: భారత వాయుసేనలో బంగారు బాణాల (గోల్డెన్ యారోస్)కు ప్రత్యేక స్థానం ఉంది. వైమానిక దళంలోని 17వ స్క్వాడ్రన్ను ముద్దుగా ఇలా పిలుస్తారు. పేరుకు తగ్గట్లే ఈ స్క్వాడ్రన్ తురుపు ముక్క. అత్యంత కఠినమైన ఆపరేషన్లను మొత్తం ఈ స్క్వాడ్రనే చూసుకొంటుంది. మాజీ ఐఏఎఫ్ చీఫ్ ధనోవా కూడా దీని నుంచి వచ్చిన ఆఫీసరే. మూడు అత్యంత కఠినమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. . 17వ స్క్వాడ్రన్కు స్థావరమైన అంబాలా దేశ సైనిక చరిత్రలో ఒక కీలక భాగం. పాకిస్థాన్తో తొలి యుద్ధం నుంచి గతేడాది బాలాకోట్ దాడి వరకు చాలా కీలక పాత్ర పోషించింది. దేశ రాజధానికి దిల్లీకి అత్యంత సమీపంలో ఉండటంతో ఈ స్థావరానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే 17వ స్వ్కాడ్రన్కు తొలి బ్యాచ్ రఫేల్ను అప్పగిస్తున్నారు.
గోల్డెన్ యారోస్కు ఓ ప్రత్యేక స్థానం
1951లో 17వ స్క్వాడ్రన్ను ఏర్పాటు చేశారు. దీనికి గోల్డెన్ యారోస్ అని పేరుపెట్టారు. తొలిసారి అమెరికాకు చెందిన హార్వర్డు-2బీ విమానాలను కేటాయించారు. ఈ విమానాలను అమెరికా తయారు చేస్తుంది. ఆ తర్వాత బ్రిటన్ తయారుచేసిన వారిపైర్ విమానానలు .. అనంతరం రష్యా తయారు చేసిన మిగ్-21లను వినియోగించారు. ఈ స్క్వాడ్రన్ 2016లో విశ్రాంతిలోకి వెళ్లే సమయానికి వీటినే వినియోగిస్తున్నారు. కీలక ఆపరేషన్లలో ఈ విభాగం పాల్గొంది. 1961లో గోవా విమోచనం, 1965 పాక్తో యుద్ధం, 1971లో మరోసారి పాకిస్థాన్తో తలపడింది. 1988లో ఈ స్క్వాడ్రన్ రాష్ట్రపతి నుంచి ‘కలర్స్’ గౌరవాన్ని అందుకొంది.
సఫేద్ సాగర్ ఇక్కడి నుంచే..
కార్గిల్ యుద్ధం సమయంలో పదాతి దళానికి మద్దతుగా ఉగ్రస్థావరాలపై నిర్వహించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో ఈ విభాగమే పాల్గొంది. దీనికి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవానే కమాండింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయనే స్వయంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గగనతలంపై నుంచి పర్వతాల్లో నక్కిన ఉగ్రవాదులపై దాడి చేయడం ధనోవా ముందున్న లక్ష్యం. పూర్తిగా పర్వతాలతో నిండిపోయిన కార్గిల్ ప్రాంతంలో 'గోల్డెన్ యారోస్' దాడులు చేసింది. వాయుసేనలోనే ఇది అత్యున్నత స్క్వాడ్రన్గా నిలిచింది. అర్ధరాత్రి వేళ వీరి బృందం అత్యంత ఎత్తైన పర్వత సానువుల్లో బాంబుల వర్షం కురిపించింది. దీంతో మన పదాతి దళాలు ముందుకు కదిలాయి. గత వాయుపోరాటాల చరిత్రలో అంత ఎత్తైన ప్రదేశాల్లో రాత్రి వేళల్లో ఎప్పుడూ దాడి చేయలేదు. కార్గిల్తోనే ఇది మొదలైంది.
అంబాలాకు ఆయనే రక్ష..
పంజాబ్లోని అంబాలా భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సూఫీ పీర్బాబా రక్షిస్తారని నమ్ముతారు. అంతేకాదు వాయుసేన కీలక ఆపరేషన్లలో ఆయనే అండగా ఉంటాడని భావిస్తారు. చాలా సైనిక దళాల్లో భగవంతుడిపై ఇటువంటి నమ్మకాలు ఉండటం సహజం. ఇక్కడ సూఫీ పీర్బాబాను నమ్ముతారు. 1930లో రాయల్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రధాన కార్యాలయంగా ఉంది. భారత వాయుసేన 1వ స్క్వాడ్రన్ను కరాచీ నుంచి ఇక్కడికే తరలించారు.
భారత వాయుసేనకు చెందిన అత్యంత కీలకమైన అస్త్రాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పనిచేసిన అధికారులు వాయుసేనలో చాలా కీలక స్థానాలకు చేరుకోవడం విశేషం. మాజీ చీఫ్ ధనోవా, మాజీ ఎయిర్ వైస్ మార్షల్ సునీల్ నాన్దోకర్ వంటి వారు ఇక్కడ పనిచేశారు.
మొదట అంబాలాకు రావాల్సిందే..
వాయుసేనకు సేవలందించేందుకు కొనుగోలు చేసే సరికొత్త రకం విమానాలు తొలత ఇక్కడకు రావాల్సిందే. తొలి రెండు జాగ్వర్ స్క్వాడ్రన్లు ఇక్కడే ఏర్పాటు చేశారు. మిగ్-21 బైసన్ తొలి స్క్వాడ్రన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు రఫేల్స్ విమానాలు. అంతేకాదు భారత వాయుసేన నిర్వహించిన అత్యంత కీలకమైన ప్రతి ఆపరేషన్లో అంబాలా పాత్ర ఉంది. అది 1947-48లో పాక్తో యుద్ధం నుంచి 2019లో జరిగిన బాలాకోట్ దాడి వరకు ఇక్కడి లోహవిహంగ బృందాల పాత్ర అత్యంత కీలకం. దేశ రాజదాని దిల్లీని కంటికి రెప్పలా కాపాడాలంటే అంబాలా స్థావరం అత్యాధునిక విమానాలతో పటిష్ఠంగా ఉండాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు