దిల్లీ కారు ప్రమాద మృతురాలి ఇంట్లో చోరీ.. స్నేహితురాలిపైనే అనుమానాలు..!
దిల్లీ కారు ప్రమాద ఘటనలో మృతిచెందిన అంజలీ సింగ్ నివాసంలో దొంగతనం జరగడం కలకలం రేపుతోంది. ఈ చోరీ వెనుక ఆమె స్నేహితురాలి హస్తం ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన (Car Horror)లో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఇదే సమయంలో మృతురాలు అంజలీ సింగ్ (Anjali Singh) ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి తమ నివాసంలోకి కొందరు ఆగంతకులు చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు అంజలి కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేరట. ‘‘ఈ ఉదయం పొరుగింటి వారు ఫోన్ చేసి చోరీ గురించి మాకు సమాచారమిచ్చారు. మేం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఎల్సీడీ టీవీ, ఇతర వస్తువులు, బెడ్ కింద దాచిపెట్టిన కొన్ని విలువైన వస్తువులు కన్పించట్లేదు’’ అని అంజలి (Anjali Singh) సోదరి మీడియాకు తెలిపారు. దీని వెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నూతన సంవత్సరం వేళ ద్విచక్రవాహనంపై వెళ్తున్న అంజలి సింగ్ ఓ కారు బలంగా ఢీకొట్టి.. 20 కిలోమీటర్ల ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అంజలి (Anjali Singh) శరీరం ఛిద్రమైంది. అయితే ఘటన సమయంలో అంజలితో పాటు ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు ఆ తర్వాత బయటికొచ్చింది. ప్రమాదం చూసి తాను భయపడిపోయాయని, అందుకే పోలీసులకు చెప్పలేదని నిధి తెలిపింది. అంతేగాక, అంజలి మద్యం సేవించి ద్విచక్రవాహనం నడిపినట్లు ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను అంజలి కుటుంబసభ్యులు ఖండించారు. మృతురాలి పోస్టుమార్టం నివేదికలోనూ మద్యం సేవించినట్లు ఆధారాల్లేకపోవడంతో నిధి వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిధి నిందితురాలిగా ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.