UN: ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశం

ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశం అని ఐక్యరాజ్యసమితికి భారత్ వివరించింది.  ముఖ్యంగా సరిహద్దుల అవతలవైపు నుంచి ఉగ్రవాద సమస్య ఎక్కువ పొంచిఉందని.. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంపై ఐరాసలో....

Published : 27 Jun 2021 01:17 IST

ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై పరోక్ష విమర్శలు

న్యూయార్క్‌: ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశం అని ఐక్యరాజ్యసమితికి భారత్ వెల్లడించింది. ముఖ్యంగా సరిహద్దుల అవతలవైపు నుంచి ఉగ్రవాద సమస్య ఎక్కువ పొంచిఉందని.. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంపై ఐరాసలో జరిగిన ఉన్నత స్ధాయి సమావేశంలో వివరించింది. గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, వారి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో దోషులుగా ఉన్నాయని పరోక్షంగా పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించింది.

ఆయా దేశాలు ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశాలుగా మారాయని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి ఆరోపించారు. ఉగ్రవాదంపై పోరాటంలో విజయం సాధించాలంటే.. మిలిటెంట్లకు ఆర్థిక సాయం దక్కకుండా చేయడం కీలకమని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడంలో కొన్ని దేశాలకు చట్టపరమైన వ్యవస్ధలు అందుబాటులో లేకుండా ఉంటే, మరికొన్ని దేశాలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే వారికి సాయం చేస్తున్నాయని తిరుమూర్తి విమర్శించారు. మిలిటెంట్లకు ఆర్థిక సాయం చేసే దేశాలను అంతర్జాతీయ సమాజం ఏకమై జవాబుదారీగా చేయాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని