ఈ సీఎంలు.. బల ‘పరీక్ష’ ముందే తప్పుకున్నారు..!
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో విఫలమై.. సభలో మెజార్టీ నిరూపించుకోలేని అశక్తుడై.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో విఫలమై.. సభలో మెజార్టీ నిరూపించుకోలేని అశక్తుడై.. విశ్వాస పరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే గతంలోనూ పలు ముఖ్యమంత్రులు సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు బలపరీక్షకు వెళ్లకుండా వైదొలిగిన సందర్భాలున్నాయి.
విశ్వాస పరీక్షకు ముందే రాజీనామా చేసిన సీఎంలు ఎవరెవరంటే..
కమల్నాథ్.. 2018 నవంబరులో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రభుత్వం రెండేళ్లు కూడా నిలబడలేదు. 2020 మార్చిలో కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమల్నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సింధియాతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. దీంతో సర్కారు మైనార్టీలో పడింది. కమల్నాథ్ మెజార్టీ నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కాంగ్రెస్కు సరిపడా సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షలో నెగ్గలేమని భావించిన కమల్నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది.
ఫడణవీస్.. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అయితే ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ వర్గం భాజపాకు మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ మరుసటి రోజే పవార్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మెజార్టీ కోల్పోయిన ఫడణవీస్.. బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా ఈ కూటమికి వ్యతిరేకంగా శివసేన నేత ఏక్నాథ్ శిందే తిరుగుబాటు చేశారు. దీంతో మైనార్టీలో పడిన ఉద్ధవ్ ఠాక్రే.. సీఎం పీఠం నుంచి దిగిపోయారు.
యడియూరప్ప.. 2018 మే నెలలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భాజపా నేత బీఎస్ యడియూరప్ప రెండు రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకు గవర్నర్ ఆమోదించడంతో యడ్డీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే భాజపాకు సంఖ్యా బలం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. జేడీఎస్తో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను సంప్రదించింది. ఈ క్రమంలోనే యడియూరప్ప బలపరీక్షను ఎదుర్కోవాలని గవర్నర్ ఆదేశించింది. అయితే మెజార్టీకి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో విఫలమైన యడ్డీ.. బలపరీక్షకు ముందే రాజీనామా చేశారు.
నబం టుకీ.. 2016 ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తలెత్తి.. ఏడాదంతా అనిశ్చితి నెలకొంది. రాష్ట్రపతి పాలన విధింపు, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ వ్యవహారమంతా సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఎమ్మెల్యేల అనర్హతను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నబం టుకి మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి పెమా ఖండూ గవర్నర్ను కలిశారు. తమకు మెజార్టీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరారు. దీంతో నబం టుకీ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. కానీ సరైన సంఖ్యా బలం లేదని గ్రహించిన టుకీ.. విశ్వాస పరీక్షకు కొద్ది గంటల ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు