Sanjay Raut: మేం వాళ్లలా కాదు.. ఎలాంటి అడ్డంకులు సృష్టించం: సంజయ్ రౌత్
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాల తర్వాత కొత్తగా ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేస్తామని భాజపా శపథం చేసిందని ఆయన ఆరోపించారు. కానీ, తాము మాత్రం ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని.. కొత్తగా కొలువుదీరిన వారంతా రాష్ట్ర ప్రజల కోసం బాగా పనిచేయాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
‘‘కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. మేం వారిని స్వాగతిస్తున్నాం. ఉద్ధవ్ ఠాక్రే అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే వాళ్లు ఆయనను ఇబ్బంది పెడతామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ, మేం అలా కాదు. మా నుంచి వారికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. వాళ్లు ప్రజల కోసం పనిచేయాలి’’ అని ఆయన స్పష్టం చేశారు. ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ బలహీనపడిందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు సంజయ్ రౌత్ సమాధానమిస్తూ.. ‘మా సంస్థ బలహీనపడిందని ఎప్పుడూ అనుకోను. ఈ విషయంపై ఎవరూ(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) బాధపడటం లేదు’ అని ఆయన అన్నారు.
మరోవైపు, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు సంజయ్ రౌత్ ఇవాళ హాజరుకావాల్సి ఉంది. ఈ విషయంపై ఆయన ట్విటర్లో స్పందించారు. ‘అవును, ఈరోజు ఈడీ విచారణకు హాజరవుతాను. ఇది పూర్తిగా రాజకీయమని అందరికీ తెలుసు. ఈడీ విచారణకు సహకరించడం దేశ పౌరుడిగా నా బాధ్యత. దీనిపై ఎవరూ చింతించకండి. ఈడీ కార్యాలయం వద్ద గుమిగూడవద్దని శివసైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా ’ అని సంజయ్ రౌత్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
-
Crime News
Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
Movies News
Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Allu Arjun: కల్యాణ్రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి