అవయవ మార్పిడి వారికి మూడో డోసుతో రక్షణ?
అవయవ మార్పిడి జరిగిన వారు మూడో డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.
తాజా అధ్యయనంలో మెరుగైన ఫలితాలు
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ను రెండు డోసుల్లో తీసుకున్న వారికి వైరస్ నుంచి పూర్తి రక్షణ కలుగుతోందని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారితోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులు రెండు డోసులు తీసుకున్నా.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వారిలో అభివృద్ధి కాకపోవడమో లేదా త్వరగా క్షీణించిపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవయవ మార్పిడి వారు మూడో డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.
అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన బాధితుల్లో కొందరికి రెండో డోసు తీసుకున్నా.. యాంటీబాడీలు వృద్ధి కావడం లేదని ఈమధ్యే జరిగిన పరిశోధనల్లో నిపుణులు గుర్తించారు. ఇలాంటి వారిపై మరింత అధ్యయనం కొనసాగించిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ (జేహెచ్యూ) పరిశోధకులు, అవయవ మార్పిడి జరిగిన 30 మంది బాధితులపై మూడో డోసు ఇచ్చి పరీక్షలు చేపట్టారు. ఇలాంటి వారికి రెండు డోసుల అనంతరం స్వల్ప స్థాయిలోనే యాండీబాడీలు వృద్ధి చెందగా.. మూడో డోసు ఇచ్చిన అనంతరం యాంటీబాడీలు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న రోగుల్లోనూ ఇమ్యూన్ సిస్టమ్ పునరుత్తేజమవుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోందని జేహెచ్యూ ఎపిడమాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డోరీ సెగెవ్ పేర్కొన్నారు. అయితే, ఏ సమయంలో, ఎంత గడువు తర్వాత ఈ డోసు ఇస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని తెలుసుకునేందుకు ఎక్కువ మందితో మరింత అధ్యయనం చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఇక అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన బాధితులతోపాటు రోగనిరోధకత తక్కువగా ఉండే వ్యక్తుల్లో వ్యాక్సిన్ పనితీరుపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ దాదాపు 380 కిడ్నీ మార్పిడి బాధితులపై అధ్యయనం జరుపుతోంది. ఇక అమెరికాలో మోడెర్నా, ఫైజర్ టీకా తీసుకున్న 658 మంది అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులపై జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఇప్పటికే అధ్యయనం చేపట్టారు. వీరిలో తొలిడోసు తీసుకున్న 98 మందిలో, రెండో డోసులు తీసుకున్న 357 మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. మరో 259 మందిలో రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఎలాంటి యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని కనుగొన్నారు. ఇలాంటి వారికి మూడో డోసు ఇవ్వడం వల్ల వచ్చే ఫలితాలపై నిపుణులు దృష్టి సారించారు. ఇలా జరిపిన అధ్యయనంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు జేహెచ్యూ పరిశోధకులు వెల్లడించారు. ఇలా అవయవ మార్పిడి చేసుకున్న కొందరికి రెండు డోసులతో రక్షణ కల్పిస్తున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదిలాఉంటే, గతకొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అవయవ మార్పిడి చేయించుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం అమెరికాలోనే 2017 నుంచి దాదాపు లక్షా 60వేల మంది అవయవ మార్పిడి చేయించుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.