Third wave: ఈ నెలాఖరుకు గరిష్ఠ కేసులు.. మార్చి మధ్యనాటికి ముగింపు
రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మూడో వేవ్ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి నెలాఖరుకు దేశంలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయి(పీక్)కి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్...
ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ అంచనా
ఇంటర్నెట్ డెస్క్: రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశంలో మూడో వేవ్ మొదలైనట్లేనని వైద్య నిపుణులు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి నెలాఖరుకు దేశంలో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయి(పీక్)కి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తాజాగా వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పీక్ సమయంలో నమోదయ్యే కేసులు.. సెకండ్ వేవ్ ఉద్ధృత దశలో బయటపడిన కేసుల సంఖ్యనూ మించే అవకాశం ఉందని తెలిపారు. వారానికి సగటున నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు వస్తాయని అంచనా వేశారు. ఈసారి గరిష్ఠ స్థాయి చాలా త్వరగా వస్తున్నందునే.. కేసుల పెరుగుదల తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం కేసుల తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ జనవరి చివర్లో గరిష్ఠ స్థాయి నమోదైతే.. మార్చి మధ్య నాటికి ఈ వేవ్ ముగుస్తుందని చెప్పారు.
మహానగరాల్లో కరోనా పరిస్థితులపై ప్రొ.అగర్వాల్ మాట్లాడుతూ.. దిల్లీలో జనవరి మధ్య నాటికి గరిష్ఠ స్థాయి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆ సమయంలో రోజుకు దాదాపు 40 వేల కేసులు బయటపడతాయని అంచనా వేశారు. ముంబయి, కోల్కతాలోనూ ఈ నెల మధ్యనాటికి గరిష్ఠ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే.. నెలాఖరుకు ఈ నగరాల్లో ప్రస్తుత వేవ్ దాదాపు ముగుస్తుందన్నారు. ఎన్నికల ర్యాలీలపై మాట్లాడుతూ.. ‘కేవలం ఈ కార్యక్రమాలను మాత్రమే వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తే.. అది తప్పు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఈ ర్యాలీలు ఒకటి. వీటిని నిరోధించడం ద్వారా.. మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలమని అనుకోవడం కరెక్ట్ కాదు’ అని స్పష్టం చేశారు. దేశంలో కరోనా వ్యాప్తిని ట్రాక్ చేసే ‘సూత్ర కంప్యూటర్ మోడల్’కు ప్రొ.అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు. గణిత సూత్రాల ఆధారంగా కేసులను అంచనా వేస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!