ఎయిర్పోర్టు కట్టబోతే.. సమాధులు బయటపడ్డాయి!
చైనా ఎంతో చరిత్ర కలిగిన దేశం. అందుకే ఎప్పుడు ఏదో ఒక చోట పురాతన వస్తువులు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా షాన్సీ ప్రావిన్స్లో ఎయిర్పోర్టును విస్తరించేందుకు నిర్మాణ పనులు చేపట్టగా వేలకొద్ది సమాధులను బయటపడ్డాయి. దీంతో నిర్మాణ ప్రాంతం కాస్త..
ఇంటర్నెట్ డెస్క్: చైనా ప్రాచీన చరిత్ర గల దేశం. అందుకే ఎప్పుడూ ఏదో ఒక చోట పురాతన ఆనవాళ్లు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా షాన్సీ ప్రావిన్స్లో ఎయిర్పోర్టును విస్తరించేందుకు నిర్మాణ పనులు చేపట్టగా వేలకొద్ది సమాధులు బయటపడ్డాయి. దీంతో నిర్మాణ ప్రాంతం కాస్త.. పురావస్తు ప్రదర్శన శాలగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే..
షాన్సీ ప్రావిన్స్ రాజధాని గ్జియాన్లో గ్జియాన్యాంగ్ ఎయిర్పోర్టు ఉంది. ఇటీవల ఈ ఎయిర్పోర్టు విస్తరణ పనులను ప్రారంభించారు. నిర్మాణంలో భాగంగా భూమిని తొవ్వుతుండగా.. సమాధులు బయటపడటం అందరిని ఆశ్చర్యపర్చింది. దీంతో నిర్మాణ కార్మికులను పక్కన పెట్టి.. పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. చైనా నూతన సంవత్సర వేడుకల కోసం పెట్టిన సెలవులు సైతం వదులుకొని ఎయిర్పోర్టు ప్రాంతంలో తవ్వకాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 4,600 పురాతన వస్తువులను వెలికితీయగా.. వాటిలో 3,500 సమాధులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమాధులు చరిత్రలో వేర్వేరు కాలాల్లో.. వేర్వేరు రాజ్యాలకు సంబంధించిన వారివిగా పురావస్తుశాఖ నిపుణులు గుర్తించారు.
గ్జియాన్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాలుగు రాజధానుల్లో ఒకటని చైనా స్టేట్ కౌన్సిల్ వెల్లడించింది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలకు 1,100 ఏళ్లపాటు గ్జియాన్ రాజధానిగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా