ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ తల్లిదండ్రుల మూఢనమ్మకం మూడు నెలల పసికందు ప్రాణం తీసింది. వ్యాధి తగ్గాలంటూ ఆ పాప శరీరంపై ఇనుపరాడ్డుతో వాతలు పెట్టడంతో ఆ చిన్నారి మృతిచెందింది.
భోపాల్: సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లోనూ ఇంకా కొందరు మూఢనమ్మకం అనే మనోవ్యాధి నుంచి బయటపడలేకపోతున్నారు. ఇంకా నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ మూడు నెలల పసికందు.. ఇలాంటి మూఢనమ్మకానికి బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి వాతపెట్టారు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న షాదోల్ జిల్లాలో చోటుచేసుకుంది.
షాదోల్లోని సింగ్పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా (pneumonia) బారినపడింది. దీంతో పాపకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే ఆమె తల్లిదండ్రులు మూఢనమ్మకంతో ఆసుపత్రికి తీసుకెళ్లకుండా స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డు (Iron Rod)తో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. ఓవైపు కాలిన గాయాలు.. మరోవైపు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అప్పుడు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే 15 రోజులు గడిచిపోయింది.
సరైన సమయంలో నిమోనియా (pneumonia)కు చికిత్స అందకపోవడంతో ఇన్ఫెక్షన్ (Infection) వ్యాపించి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పాపకు హడావుడిగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఖననం చేసిన పాప మృతదేహాన్ని వెలికి తీసి శనివారం పోస్టుమార్టం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఘటనపై షాదోల్ జిల్లా కలెక్టర్ వందన వేధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘వాతలు పెట్టొద్దని స్థానిక అంగన్వాడీ కార్యకర్త చెప్పినా ఆ పాప తల్లి పట్టించుకోలేదు. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిమోనియాకు ఇలాంటి ‘చికిత్స’లు సర్వసాధారణమయ్యాయి. దీనిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భాజపా నేతలు.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె