Vande Bharat express: దక్షిణాదికి త్వరలో మరో 3 ‘వందే భారత్’ రైళ్లు.. తిరుపతి రూట్లో ఒకటి?
దక్షిణాదికి మరో మూడు వందే భారత్ రైళ్లు రాబోతున్నాయి! సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె మధ్య సర్వీసులందించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు చేస్తున్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
దిల్లీ: దక్షిణాదికి త్వరలో మరో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) రైళ్లు రాబోతున్నాయ్..! దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతోన్న భారతీయ రైల్వే(Indian railways) మరో మూడు సెమీ హైస్పీడ్ రైళ్ల(Semi hi-speed rails)ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు; సికింద్రాబాద్ నుంచి తిరుపతి; సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీసులందించనున్నట్టు సమాచారం. దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ రైలును చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య గతేడాది నవంబర్లో ప్రారంభించగా.. ఇటీవల సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల మధ్య (సికింద్రాబాద్-వైజాగ్) మరో రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య సర్వీసులు ప్రారంభమైనప్పట్నుంచి ఈ రైలు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, కర్ణాటక, తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటం.. వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తోంది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు వీలుగా భాజపా శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. వందేభారత్ రైళ్ల మెయింటీనెన్స్ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ డివిజన్లలో కనీసం ఒక్క కోచింగ్ డిపోలోనైనా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలని దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే డివిజన్ల అధికారులు కోరినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరికల్లా 75 వందే భారత్ రైళ్లు నడపాలని కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. అలాగే, వచ్చే మూడేళ్లలో 400లకు పైగా వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించడమే టార్గెట్గా పెట్టుకుంది. ఈ రైళ్లను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దేశంలోని పలు నగరాల మధ్య ఎనిమిది రైళ్లను నడుపుతోంది. మేకిన్ ఇండియాలో భాగంగా చెన్నైలోని పెరంబూరులో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు తయారవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!