ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతం

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్‌నాద్‌ ప్రాంతంలో..

Updated : 17 Jul 2020 10:12 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతాదళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లా నాగ్‌నాద్‌ - చిమ్మెర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు కూడా గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు