SpiceJet: స్నేహితుల ‘ప్రేమ’ కోసం.. విమానంలో బాంబు ఉందంటూ ఫోన్
స్పైస్జెట్ (SpiceJet) విమానానికి నకిలీ బాంబు బెదిరింపు ఘటనలో దిల్లీ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు తన బాల్య స్నేహితుల ప్రేమ కోసమే ఈ నాటకమాడినట్లు తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.
దిల్లీ: స్పైస్జెట్ (SpiceJet) విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్కాల్ ఇటీవల దిల్లీ ఎయిర్పోర్టులో కలకలం సృష్టించింది. అయితే అది నకిలీ బెదిరింపు అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే నకిలీ కాల్ (Hoax Bomb Call) చేయడం వెనుక కారణం తెలిసి అధికారులు అవాక్కయ్యారు. నిందితుడు తన స్నేహితుల ‘ప్రేమ’ కోసం విమానంలో బాంబు ఉందంటూ ఉత్తుత్తి బెదిరింపులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గత గురువారం రాత్రి దిల్లీ (Delhi) నుంచి ఓ స్పైస్జెట్ (SpiceJet) విమానం పుణె (Pune) వెళ్లడానికి సిద్ధంగా ఉండగా ఎయిర్లైన్ కాల్ సెంటర్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని ఆగంతకుడు చెప్పడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సీఐఎస్ఎఫ్ (CISF) కంట్రోల్ రూంకు సమాచారమందించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే విమానాన్ని నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఆ బెదిరింపు ఉత్తుత్తిదే అని అధికారులు తేల్చారు.
అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బ్రిటిష్ ఎయిర్వేస్ ట్రైనీ టికెటింగ్ ఏజెంట్ అభినవ్ ప్రకాశ్ ఈ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రకాశ్ బాల్య స్నేహితులైన రాకేశ్, కునాల్కు ఇటీవల మనాలీ ట్రిప్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువతులతో పరిచయం ఏర్పడింది. గురువారం ఆ అమ్మాయిలిద్దరూ స్పైస్జెట్ విమానంలో పుణె వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాకేశ్, కునాల్.. ప్రకాశ్ను సాయం కోరారు. తమ గర్ల్ఫ్రెండ్స్తో మరింత సమయం గడిపేందుకు ఎలాగైనా విమానాన్ని ఆలస్యం చేయాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తాము ముగ్గురం కలిసి ఈ బాంబు నాటకం ఆడామని ప్రకాశ్ పోలీసు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం ప్రకాశ్ స్నేహితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.