Titanic: నౌక మునుగుతోంది.. అయినా ప్రయాణికులను రక్షించి కడలిలో కలిశారు!
టైటానిక్.. ఈ పేరు వింటే మనకు మొదటగా గుర్తొచ్చేది విషాద ఘటనే! 1912లో సౌతంప్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా.. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్బర్గ్ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1500 మంది మృతి చెందడం అందరికి తెలిసిందే. కానీ.. ఇది నాణెనికి...
‘టైటానిక్’ ఇంజినీరింగ్ సిబ్బంది త్యాగనిరతి
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
టైటానిక్.. ఈ పేరు వింటే మనకు మొదటగా గుర్తొచ్చేది విషాద ఘటనే! 1912లో సౌతంప్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా.. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్బర్గ్ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1500 మంది మృతి చెందడం అందరికి తెలిసిందే. కానీ.. ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ మహా జలసౌధం నిర్మాణం, ప్రయాణం వెనుక తెలియని విశేషాలెన్నో! ప్రమాద సమయంలో ప్రయాణికులను రక్షించడమే పరమావధిగా విధులు నిర్వహించి.. తుదకు నౌకతోపాటే జలసమాధి అయిన ప్రాణాలెన్నో! ఇందులో ముందువరుసలో నిలిచేది.. ఓడలోని ఇంజినీరింగ్ సిబ్బందే. వీరిలో ఏ ఒక్కరూ బతకలేదంటే.. చివరి క్షణంలోనూ వారి నిబద్ధత అర్థం చేసుకోవచ్చు. వీరి త్యాగాలకు ప్రతీకగా నిర్మించిన ఓ స్మృతివనం.. నేటికీ ఆనాటి జ్ఞాపకాలను కళ్లముందు ఉంచుతోంది.
నౌక నిర్మాణ విశేషాలు..
ఆ సమయంలో ఇంతటి భారీ నౌక నిర్మాణం ఎవరూ ఊహించనిది.ఇతర నౌకా నిర్మాణ కంపెనీల కంటే ముందుండాలనే ‘వైట్ స్టార్ లైన్’ సంస్థ ఛైర్మన్ జే బ్రూస్ ఇస్మాయ్ ఆలోచనలే.. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఓడ నిర్మాణానికి దారితీశాయి. ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో 1909లో ప్రారంభమైన నిర్మాణం 1912 ఏప్రిల్ నాటికి పూర్తయింది.
* టైటానిక్ పొడవు 269.06 మీటర్లు, గరిష్ఠ వెడల్పు 28.19 మీటర్లు, ఎత్తు 32 మీటర్లు, బరువు దాదాపు 46,328 టన్నులు. పదకొండు డెక్లు ఉన్నాయి. అందులో ఎనిమిది ప్రయాణికుల కోసం కట్టినవి. నీటి ఆవిరే ఇంధనం. భారీ పిస్టన్ ఇంజిన్లు దీని సొంతం.
* ఓడ నిర్మాణంలో దాదాపు రెండు వేల ఉక్కు పలకలు వాడారు. ఒక్కోటి 1.8 మీటర్ల వెడల్పు, 9.1 మీటర్ల పొడవు, బరువు 2.5- 3 టన్నులు. స్టీల్ వెల్డింగ్ ఇంకా ప్రాచుర్యంలోకి రాని కారణంగా.. దాదాపు 30 లక్షలకు పైగా నట్లు, బోల్టులు వినియోగించారు.
* 15 వేల మంది కార్మికులు నిర్మాణంలో పాల్పంచుకున్నారు. చేతులు తెగిపడటం, ఉక్కు పలకల కింద కాళ్లు నలగడం వంటి ప్రమాదాలు అనేకం జరిగాయి.
* నిర్మాణ దశలోనే ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు షిప్యార్డ్ వర్క్షాప్, షెడ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఓడ జలప్రవేశానికి ముందు.. పడిపోతున్న చెక్కపలక తగిలి ఓ కార్మికుడు మృతి చెందాడు.
* నౌకలో ఆవిరితో నడిచే నాలుగు 400 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ జనరేటర్లు, అత్యవసర అవసరాలకు మరో రెండు 30 కేడబ్ల్యూ సహాయక జనరేటర్లతో ఎలక్ట్రికల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఒక సాధారణ నగరంలోని పవర్ స్టేషన్ కంటే ఎక్కువ విద్యుత్శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దీని సొంతం.
* సముద్రంలో లంగరు వేసేందుకు ఉపయోగించిన సెంటర్ యాంకర్ బరువు 15 టన్నులు. పొడవు 18 అడుగుల ఆరంగుళాలు. అప్పట్లో చేతితో తయారు చేసిన అతిపెద్ద యాంకర్ ఇదే!
మరువలేనిది.. ఇంజినీర్ల త్యాగం
టైటానిక్కు చీఫ్ ఇంజినీర్గా జోసెఫ్ బెల్ వ్యవహరించారు. ఆయన బృందంలో 24 మంది సివిల్ ఇంజినీర్లు, ఆరుగురు ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, ఇద్దరు బాయిలర్ మేకర్లు, ఒక ప్లంబర్, ఒక క్లర్క్ ఉన్నారు. ప్రమాద సమయంలో అందులోనే ఉన్న వీరంతా.. ప్రయాణికులను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. అత్యవసర పడవలను నీళ్లలోకి దించుతూ.. పనిలోనే నిమగ్నమై, చివరకు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సౌతంప్టన్లోని ఈస్(ఆండ్య్రూస్) పార్క్లో ‘టైటానిక్ ఇంజినీర్స్ మెమోరియల్’ పేరిట ఓ స్మారక వనాన్ని నిర్మించారు. 1914లో దీని ప్రారంభ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరై.. శ్రద్ధాంజలి ఘటించారు! ‘చివరి క్షణాల్లోనూ తమ కర్తవ్యానికి అంకితమైన ఈ ఇంజినీర్లు.. మానవ జాతి అత్యుత్తమ సంప్రదాయాలను సమర్థంగా కొనసాగించారు’ అంటూ ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ ఇంజినీర్స్ అప్పటి ప్రెసిడెంట్ సర్ ఆర్చిబాల్డ్ డెన్నీ భావోద్వేగానికి గురయ్యారు.
2010లో పునరుద్ధరణ..
సౌతంప్టన్ సిటీ కౌన్సిల్, టీవీ నిర్మాణ సంస్థ ట్వంటీ ట్వంటీ టెలివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో 2010లో ఈ స్మారక వనాన్ని పునరుద్ధరించారు. ఇదే ప్రమాదంలో కన్నుమూసిన ప్రఖ్యాత వాయొలిన్ కళాకారుడు వాలెస్ హార్ట్లీ, ఇతర సంగీతకారుల స్మృత్యార్థం ప్రధాన స్మారకానికి ఎదురుగా ‘టైటానిక్ మ్యూజిషియన్స్ మెమోరియల్’ నిర్మించారు.
విషాదం నేర్పిన పాఠాలు..
‘ప్రమాదాన్ని మినహాయిస్తే.. టైటానిక్ ఇంజినీరింగ్ డిజైన్, నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవు. కానీ.. ఏ ఇంజినీర్ కూడ ప్రకృతి శక్తులతో పోటీ పడలేడు’ - టైటానిక్ను నిర్మించిన హార్లాండ్, వోల్ఫ్ ప్రతినిధి డేవిడ్ మెక్వేగ్ అన్న మాటలివి. నేటికీ ఓడలు ఈ తరహా ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే.. టైటానిక్ ప్రమాదంతో ఓడ నిర్మాణ రంగం, అందులో కల్పించాల్సిన సౌకర్యాలపై మరింత అవగాహన వచ్చినట్లు చెప్పారు. మరిన్ని ఎమర్జెన్సీ బోట్లను అందుబాటులో ఉంచడం, ఆటోమేటిక్ బల్క్ హెడ్ డోర్ల అభివృద్ధి తదితర ఏర్పాట్లు ఇందుకు ఉదాహరణలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మోదీ.. సంపన్నులకు ఆయనో సాధనం’.. రాహుల్ విమర్శలు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సంపన్నులకు ఓ సాధనంగా మారారని అభివర్ణించారు. -
భాజపాను గెలిపించేది కాంగ్రెసే: గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్పై జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని దుయ్యబట్టారు. -
‘మీరేం అమాయకులు కాదు’.. పతంజలి కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
Patanjali Row: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని పతంజలి యాజమాన్యాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
అర్ధరాత్రి విచారణా..? నిద్రించే హక్కును ఉల్లంఘించడమే: బాంబే హైకోర్టు
అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక సీనియర్ సిటిజన్ను ఈడీ ప్రశ్నించడాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. ఆ పద్ధతిని తాము అంగీకరించలేమని తెలిపింది. -
జీలం నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జీలం నదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. -
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Salman Khan: సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వారిని తాజాగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్-సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం తెలిపింది. -
112 ఏళ్ల టైటానిక్ విషాదం.. ఛత్తీస్గఢ్లో ఆరని విద్యాదీపం
సరిగ్గా 112 ఏళ్ల క్రితం ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగి దాదాపు 1,500 ప్రాణాలను జలసమాధి చేసిన టైటానిక్ ఓడ విషాదం తలచుకొని ప్రపంచం ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది. -
పన్వెల్లో నెల రోజులుగా మకాం
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ బాంద్రా నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు నవీ ముంబయి పన్వెల్లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కేజ్రీవాల్ను కరడుగట్టిన తీవ్రవాదిలా చూస్తున్నారు
తిహాడ్ జైలులో ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జడ్ ప్లస్ భద్రత మధ్య కలుసుకున్నారు. -
2 నిమిషాలకు సరిపడా ఇంధనం ఉండగా ల్యాండింగ్
అయోధ్య నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడంతో దానిని చండీగఢ్కు మళ్లించారు. -
అవినీతి ఇకపై వాటికి ‘పాస్వర్డ్’ కాదు.. జైలుకెళ్లే మార్గం: జగదీప్ ధన్ఖడ్
అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని..అవకాశాలు, ఉద్యోగాలకు ఇకపై అవినీతి అనేది ఓ పాస్వర్డ్లా కాకుండా జైలుకు వెళ్లే మార్గంలా ఉంటుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. -
అన్ని సీజన్లలో సాగు చేసేలా 93 కొత్త ఉల్లి వంగడాలు
ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 93 రకాల కొత్త ఉల్లి వంగడాలను అభివృద్ధి చేశారు. -
అయోధ్య బాలరాముడికి ‘సూర్య తిలకం’
శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు (8)
మథురలోని శ్రీకృష్ణజన్మభూమి ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో కోర్టు పర్యవేక్షిత సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమతి అమలుపై నిలుపుదల (స్టే) ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. -
నిబంధనల ప్రకారమే రాహుల్ హెలికాప్టర్ తనిఖీ
నిర్ణీత షెడ్యూల్ లేకుండా ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లపై ప్రామాణిక నిబంధనల ప్రకారమే నిఘా ఉంచడంతో పాటు తనిఖీ చేస్తున్నామని ఎన్నికల కమిషన్ (ఈసీ) వర్గాలు తెలిపాయి. -
కేజ్రీవాల్ కస్టడీ 23 వరకూ పొడిగింపు
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈ నెల 23 వరకు స్థానిక కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థను కాపాడుకోవాలి
వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యూహాత్మకంగా న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లేలా ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమైన ధోరణి అని 21 మంది విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు. -
ఎన్నికల బాండ్ల రద్దుపై అందరూ బాధపడతారు: మోదీ
ఎన్నికల బాండ్ల విధానంపై నిజాయతీగా ఆలోచిస్తే.. వాటి రద్దు గురించి ప్రతిఒక్కరూ బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. -
రోజుకు రూ.100 కోట్లు!
ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
జైల్లో కేజ్రీవాల్.. ‘ఆ పత్రాలపై ఖైదీలు సంతకాలు చేయలేరు’ - జైళ్లశాఖ డీజీ
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారు కేవలం రెండు రకాల పత్రాలపైనే సంతకాలు చేయగలరని, అవి రాజకీయ స్వభావం కలిగి ఉండకూడదని జైళ్లశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
తీర ప్రాంతాన్ని దోచుకునేందుకు జగన్ కుట్ర: ఆనం
-
ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్.. ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు
-
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి
-
‘మోదీ.. సంపన్నులకు ఆయనో సాధనం’.. రాహుల్ విమర్శలు
-
‘అమెరికాలో హిందువులపై దాడులు పెరిగాయ్’ - చట్టసభ సభ్యుల ఆందోళన
-
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..