తమిళనాడులో 12వ తరగతి పరీక్షలు రద్దు
తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. లోతైన సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను......
నీట్ రద్దు చేయాలంటూ మోదీకి స్టాలిన్ లేఖ
చెన్నై: తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. లోతైన సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు. మార్కులు కేటాయించే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ స్కోర్ ఆధారంగానే ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటానికి తోడు థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులతో మూడు రోజులుగా జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ ఏడాది ఇంటర్ బోర్డు పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించినట్టు స్టాలిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే విద్యార్థులకు మార్కుల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నీట్ సహా అన్నిజాతీయ స్థాయి పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మరోవైపు తమిళనాడులో ఈ ఒక్కరోజే 21,410 కొత్త కేసులు, 443 మరణాలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?