China: పిల్లలకు బండెడు హోంవర్క్ వద్దు.. చైనాలో కొత్త చట్టం!
చైనాలోని జిన్పింగ్ సర్కారు భావితరాలను గాడిన పెట్టేందుకు కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది. పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి నింపడమే లక్ష్యమని చెబుతూ వారి అలవాట్లపై ఒకరకంగా ఆంక్షలు విధిస్తోంది....
బీజింగ్ : చైనాలోని జిన్పింగ్ సర్కారు భావితరాలను గాడిన పెట్టేందుకు కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తోంది. పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి నింపడమే లక్ష్యమని చెబుతూ వారి అలవాట్లపై ఒకరకంగా ఆంక్షలు విధిస్తోంది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్ సమయాన్ని కుదించింది. అలాగే పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని గుర్తుచేస్తూ.. పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో జిన్పింగ్ తీసుకొస్తున్న కొత్త చట్టాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది..!
హోంవర్క్, ట్యూషన్ ఒత్తిడి తగ్గించేలా..
తాజాగా పిల్లలపై ఒత్తిడి తగ్గించేందుకు గానూ.. హోంవర్క్, ట్యూషన్ల భారాన్ని తగ్గించే దిశగా మరో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే నిబంధనలన అమలు చేసే బాధ్యత స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తోందట! అలాగే పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని మరోసారి ఈ చట్టం ద్వారా గుర్తుచేయనుందని సమాచారం. అలాగే పిల్లలు ఇంటర్నెట్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించనుందట! ఈ కొత్త చట్టం సత్ఫలితాలిచ్చే అవకాశం ఉన్నట్లు అక్కడి నిపుణులు భావిస్తున్నారు. వీటి వల్ల పిల్లలపై మానసిక ఒత్తిడి తగ్గి.. సృజనాత్మకత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఆన్లైన్ వీడియో గేమ్స్పై..
పిల్లలు ఆన్లైన్లో ఆడే వీడియో గేమ్స్పై చైనా ఆంక్షలు విధించింది. 18 ఏళ్ల వయస్సులోపు వారు ఇకపై వారంలో మూడు గంటలు మాత్రమే ఆడుకొనేలా కొత్త విధివిధానాలు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి శుక్రవారాలు, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ (NPPA) ఉత్తర్వులు జారీ చేసింది. వారంలో కేవలం మూడు గంటలకే పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది. ఈ కొత్త నిబంధనలతో చైనాలోని గేమింగ్ దిగ్గజం టెన్సెంట్తో పాటు అలీబాబా తదితర అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి గేమ్లను చైనా ఓ మత్తుమందుగా భావిస్తోంది. దీర్ఘకాలంలో వ్యసనంగా మారితే పిల్లల చదువులు, వ్యవహార శైలిపై ప్రభావం పడే అవకాశం ఉందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, గేమింగ్ కంపెనీలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు నిబంధనల అమలును పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.
పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష..
పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులను శిక్షించేలా చైనా ఇటీవలే కొత్తచట్టాన్ని సిద్ధం చేసింది. ‘ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లా’ పేరుతో ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించింది. దీని ప్రకారం- పిల్లల ప్రవర్తన సరిగా లేకపోయినా, వారు నేరాలకు పాల్పడినా ముందుగా తల్లిదండ్రులకు సమాచారమిస్తారు. ఆ తర్వాత బిడ్డల్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కన్నవారిపైనే ఉంటుంది. అప్పటికీ పిల్లలు మారకపోతే, వారి తల్లిదండ్రులు పనిచేసే సంస్థలకు, లేదా యజమానులకు విషయం చేరవేస్తారు. తర్వాత తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి వారు తప్పనిసరిగా హాజరుకావాలి. లేకుంటే 156 డాలర్ల (సుమారు రూ.11,600) జరిమానా, 5 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముంటుంది. చిన్నారుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి చాలా కారణాలున్నా, వారి పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడమే ప్రధాన కారణమని చైనా చట్టసభ వ్యవహారాల కమిషన్ అధికార ప్రతినిధి జాంగ్ తైవే పేర్కొన్నారు.
ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత చైనాలో స్వతంత్ర భావజాలం పెరిగిందని.. కమ్యూనిస్టు ప్రభుత్వ కఠిన చట్టాలపై ప్రజలు తిరగబడే అవకాశమున్న నేపథ్యంలో ఈ తరహా చట్టాలను తీసుకొస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇలా చట్టాల ద్వారా పౌరుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చడం ఏమాత్రం సరికాదని కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై ఆంక్షల వల్ల వారు వారి స్వేచ్ఛను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్ వినియోగం వల్ల పిల్లలు పక్కదారి పడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీని, దేశాన్ని, ప్రజలను, సామ్యవాదాన్ని ప్రేమించేలా తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్