Vaccination: భారత వ్యాక్సినేషన్లో ఈ రోజు ముఖ్యమైంది: మోదీ
దేశ ప్రజల సహకారం వల్లే ఈ టీకా కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
దిల్లీ: దేశ ప్రజల సహకారం వల్లే కరోనా టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నేటి నుంచి 12-14 ఏళ్ల వయస్సువారికి టీకా పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో.. భారత టీకా కార్యక్రమంలో ఈ రోజు ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. అలాగే దశలవారీగా నిర్విఘ్నంగా సాగుతోన్న ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.
‘అర్హులైన భారతీయులందరికీ టీకా ఇచ్చేందుకు చేస్తోన్న ప్రయత్నాల్లో ఈ రోజు ముఖ్యమైంది. ఇప్పటి నుంచి.. 12 నుంచి 14 ఏళ్ల వయస్సువారు టీకా తీసుకునేందుకు అర్హులుగా మారారు. అలాగే ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన అందిరికీ ప్రికాషనరీ డోసు ఇస్తున్నాం. ఈ వయస్సువారంతా టీకా తీసుకోవాలని కోరుతున్నాను. ప్రజల సహకారంతోనే గత ఏడాది ప్రారంభం నుంచి ఈ టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఇతర దేశాల్లో టీకా పట్ల అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. మన దగ్గర ప్రజలు టీకా తీసుకోవడమే కాకుండా, ఇతరులు టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ తీరు చూడటానికి చాలా బాగుంది’ అని వెల్లడించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమం విజయం వెనుక ఉన్న శాస్త్రవేత్తల్ని ఈ సందర్భంగా మోదీ అభినందించారు. దేశంలో కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడే.. ఇక్కడ టీకాలు రూపొందించే పని ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆ సమయంలో తాను టీకా తయారీ సంస్థలను సందర్శించిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇక భారత్లో ఇప్పటివరకూ 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని తెలిపారు. అందులో 15 నుంచి 17 వయస్సు వారికి 9 కోట్లకు పైగా డోసులు, రెండు కోట్లకు పైగా ప్రికాషనరీ డోసులు ఇచ్చినట్లు చెప్పారు. అంతేగాకుండా వ్యాక్సిన్ మైత్రికింద విదేశాలకు టీకా పంపామని, ప్రపంచం కరోనాపై జరుపుతోన్న పోరాటంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు