Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు తగ్గడం.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఊరటనిస్తోంది. మరోవైపు, యాక్టివ్ కేసుల కొండ కరుగుతోంది..........
ఇంటర్నెట్ డెస్క్: దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు తగ్గడం.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఊరటనిస్తోంది. మరోవైపు, యాక్టివ్ కేసుల కొండ కరుగుతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్తో సతమతమవుతున్న వేళ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళ పలు రాష్ట్రాలు కొన్ని సడలింపులు ఇస్తూ లాక్డౌన్లను పొడిగిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఉపశమనం కలిగించే కొన్ని వార్తలు మీకోసం..
👍 దేశంలో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా దిగి వస్తోంది. కొత్త కేసులు 58 రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా 23వ రోజూ కొత్త కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే భారీగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 20.84లక్షల టెస్ట్లు చేయగా.. దాదాపు 1.20లక్షల మందికి పైగా ఈ వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వరుసగా తొమ్మిదో రోజూ 2లక్షల కన్నాతక్కువ కేసులే నమోదు కావడం గమనార్హం. రోజువారీ పాజిటివిటీ రేటు 5.78శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 6.89శాతంగా ఉంది. ఇప్పటివరకు 36.11కోట్ల పరీక్షలు చేశారు.
👍 తెలంగాణలో ఎంపికచేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఈనెల 7న ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిల్లో కరోనా పరీక్షలతో పాటు మొత్తంగా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య సేవలు, పలు అంశాలపై ప్రగతిభవన్ నుంచి అధికారులతో చర్చించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రోగం కంటే పరీక్షల ఖరీదే ఎక్కువైందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
👍 మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో 1179 గ్రామాలు కరోనాలేని గ్రామాలుగా మారాయి. ఈ జిల్లాల్లో మొత్తంగా 1604 గ్రామాలు ఉండగా.. 1179 గ్రామాలు కరోనా ఫ్రీ విలేజ్లుగా నిలిచాయని, కొవిడ్ సెకండ్ వేవ్లో అయితే, 271 గ్రామాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. కరోనా విజృంభణతో నాందేడ్ జిల్లాలో ఇప్పటివరకు 90వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1800 మంది మృతిచెందినట్టు వివరించారు.
👍 కరోనాతో పోరాడే యాంటీబాడీలను గుర్తించేందుకు సరికొత్త రాపిడ్ బ్లడ్ టెస్టును అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో 5నిమిషాల కన్నాతక్కువ వ్యవధిలోనే శరీరంలో యాంటీబాడీలను గుర్తించవచ్చు. కరోనా సోకిన రోగుల నుంచి సేకరించిన 400 రక్త నమూనాలను ఈ పద్ధతిలో పరీక్షించగా 87.5 శాతం కచ్చితత్వంతో యాంటీబాడీలను గుర్తించిందని తెలిపారు. ఇది బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి చేసే రక్తపరీక్షలాగే ఉంటుందట. రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు, స్టేడియాల్లో ప్రజలను పరీక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
👍 కరోనా వైరస్పై పోరాటంలో వ్యాక్సినే కీలక అస్త్రం. కరోనా సెకండ్ వేవ్తో సతమతమవుతున్న భారత్కు మూడో ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వాలు సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసేలా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 36,50,080 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. మరోవైపు, దేశంలో ఇప్పటివరకు 22,78,60,317 టీకా డోసులు పంపిణీ జరగ్గా.. ఇంకా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.65కోట్ల మేర డోసులు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. అలాగే, రాష్ట్రాలకు ఇప్పటివరకు 24కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ను సమకూర్చినట్టు (రాష్ట్రాలు నేరుగా సేకరించుకున్నవాటితో కలిపి) వివరించింది.
👍 తమిళనాడు ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ను పొడిగించింది. కొన్ని సడలింపులతో లాక్డౌన్ ఈ నెల 14వరకు కొనసాగిస్తున్నట్టు సీఎం స్టాలిన్ వెల్లడించారు. అత్యధిక పాజిటివిటీ రేటు కలిగిన 11 జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలుచేయనుండగా.. మిగతా జిల్లాల్లో సడలింపులు ఇస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, దిల్లీలోనూ కరోనా అదుపులోకి రావడంతో అన్లాక్ ప్రక్రియను మొదలు పెట్టారు. మార్కెట్లు, మాల్స్ను సరి బేసి పద్ధతిలో తెరవాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ప్రైవేటు కార్యాలయాలకు 50శాతం సిబ్బందితో అనుమతిస్తున్నట్టు చెప్పారు. మరిన్ని సడలింపులతో జూన్ 14వరకు లాక్డౌన్ను కొనసాగిస్తున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. హిమాచల్ప్రదేశ్లోనూ కరోనా కర్ఫ్యూని జూన్ 14వరకు పొడిగించారు. అలాగే, 12వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్టు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా కర్ఫ్యూని ఈ నెల 15వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గోవా కూడా ఈ నెల 14వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూని పొడిగించింది.
👍 హైదరాబాద్కు చెందిన హెటెరో గ్రూపు రష్యాకు చెందిన కొవిడ్-19 టీకా ‘స్పుత్నిక్ వి’ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ టీకాను ఉత్పత్తి చేసి, మన దేశంతో పాటు ఇతర దేశాలకు అందించడానికి రష్యా సంస్థ ఆర్డీఐఎఫ్తో హెటెరో గ్రూపు కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో హెటెరో సంస్థకు ఆర్డీఐఎఫ్ నుంచి స్పుత్నిక్ వి టీకా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావడంతో ‘స్పుత్నిక్ వి’ టీకా ఉత్పత్తి మొదలుపెట్టినట్లు హెటెరో గ్రూపు ఛైర్మన్ బి.పార్థసారధి రెడ్డి తెలిపారు. స్పుత్నిక్ వి టీకాతో పాటు స్పుత్నిక్ లైట్ టీకానూ ఉత్పత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 20 కోట్ల డోసుల స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ టీకాల ఉత్పత్తికి వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
👍 ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ. లిమిటెడ్(బీఇ) అభివృద్ధి చేస్తున్న కార్బివాక్స్ టీకా దేశంలోనే అత్యంత చౌకైన వ్యాక్సిన్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి రూ. 500గా ఉండనున్నట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. అంటే ఒక్కో డోసు ధర కేవలం రూ. 250 మాత్రమే. ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చని సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఒకే ధరకు విక్రయించనున్నారా? లేదా? అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.
👍 కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 4500 మంది ఖైదీలకు పెరోల్ను పొడిగిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 60 రోజుల పాటు పెరోల్ అవకాశం కల్పించిన ప్రభుత్వం.. కరోనా కేసులు పెరగడంతో తాజాగా మరో 30 రోజుల పాటు ఆ గడువును పెంచుతున్నట్టు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం పెరోల్పై ఉన్న ఖైదీలు జైలుకు వస్తే మిగతా వారికి వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మరోవైపు, జైలులో ఉన్న ఖైదీలందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 18వేల మంది ఖైదీలకు వ్యాక్సిన్ వేసినట్టు చెప్పారు.
👍 వ్యాక్సినేషన్ విషయంలో పశ్చిమబెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న చర్యలు చేపట్టింది. ‘వ్యాక్సినేషన్ ఆన్ వీల్స్’ పేరిట మార్కెట్ల వద్ద ప్రత్యేక ఏసీ బస్సులతో మొబైల్ వ్యాక్సినేషన్ సర్వీసు ఏర్పాటు చేసింది. మొబైల్ క్లీనిక్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లోనే రవాణా సిబ్బందితో పాటు కూరగాయలు విక్రయించేవారు, నిత్యావసరాలు, చేపలు అమ్మేవారు, తదితరులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం