Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
దేశంలో తీవ్ర కల్లోలం రేపిన కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు కనబడుతోంది. కొత్త కేసులు తగ్గి.. రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల కొండ కరుగుతోంది.......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో తీవ్ర కల్లోలం రేపిన కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు కనబడుతోంది. కొత్త కేసులు తగ్గి.. రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల కొండ కరుగుతోంది. మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా పుంజుకొంటోంది. డిసెంబర్ కల్లా 200 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని జేపీ నడ్డా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొందరిలో వెలుగుచూస్తున్న బ్లాక్ ఫంగస్ చికిత్సకు కేంద్రం మరోసారి రాష్ట్రాలకు అదనంగా ఔషధాలను కేటాయించింది. కొవిడ్ వేళ ఉపశమనం కలిగించే ఇలాంటి కొన్నివార్తలు మీకోసం..
* దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుతోంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు ‘లక్ష’ మార్కు దాటలేదు. బుధవారం 20,04,690శాంపిల్స్ పరీక్షించగా.. 94,052మందిలో వైరస్ ఉన్నట్టు తేలింది. పాజిటివిటీ రేటు 17వ రోజు కూడా 10శాతం కన్నా తక్కువే (4.69శాతం) నమోదు కాగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 5.43కి తగ్గింది. వరుసగా 28వ రోజూ కొత్త కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే భారీగా కొనసాగింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 33,79,261 డోసుల టీకాను అందించగా.. ఇప్పటివరకు 24.27కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది.
* మన దగ్గర ప్రస్తుతం నెలకు కోటి వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అవుతున్నాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ‘‘జులై-ఆగస్టు నాటికి ఆ సామర్థ్యం 6 నుంచి 7కోట్లకు చేరుతుంది. సెప్టెంబర్ నాటికి నెలకు 10కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని భావిస్తున్నాం. గతంలో రెండు సంస్థలే టీకాను ఉత్పత్తి చేసేవి.. ఆ సంఖ్య ప్రస్తుతం 13కి చేరింది. డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 19కి చేరుతుంది. డిసెంబర్ కల్లా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయి. ఇదే మా రోడ్ మ్యాప్’’ అని నడ్డా వివరించారు. అరుణాచల్ప్రదేశ్లో భాజపా నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన గురువారం పాల్గొన్నారు.
* టీఎస్ ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ తెలిపారు. తెలంగాణ ఎంసెట్కు ఇప్పటివరకు 2,20,027 దరఖాస్తులు, ఎంసెట్ ఇంజినీరింగ్కు 1,46,541, అగ్రికల్చర్కు 73,486 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
* పిల్లలకు పాలిచ్చే తల్లులకు కూడా కరోనా టీకా సురక్షితమేనని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ద్వారా కరోనాపై పోరాడేందుకు వారి శరీరంలో యాంటీబాడీలు తయారవ్వడమే కాకుండా తల్లి పాలద్వారా అవి పిల్లలకు కూడా అందుతాయని తెలిపింది.
* టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే అథ్లెట్లకు జులై ప్రారంభానికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నట్టు భారత క్రీడల ముఖ్య అధికారి నరేందర్ బాత్రా వెల్లడించారు. జులై 23 నుంచి ఆగస్టు 8వరకు జరిగే ఈ ఒలింపిక్స్కు భారత్ నుంచి దాదాపు 200 మంది అథ్లెట్లు, కోచ్లు, సహాయక సిబ్బంది వెళ్లనున్నారు.
* లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రారంభించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో 1200 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు అందించారు. కరోనాను నిర్మూలనకు ప్రభుత్వం పాటు పడుతున్నప్పటికీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొవిడ్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో BLR బ్రదర్స్ గత కొన్నిరోజులుగా అండగా నిలుస్తున్నారని తెలిపారు.
* కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వెంటాడుతున్న బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బి వయల్స్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అదనంగా 1.7లక్షల వయల్స్ కేటాయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. కర్ణాటకకు అదనంగా 15,520 వయల్స్ను కేటాయించడంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రానికి మొత్తంగా ఇచ్చిన ఇంజెక్షన్ల సంఖ్య 40,470కి చేరిందని పేర్కొన్నారు.
* వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న తమిళనాడుకు 95వేల కొవాగ్జిన్ డోసులు అందడం ఊరటనిస్తోంది. హైదరాబాద్ నుంచి చెన్నై విమానాశ్రయానికి గురువారం ఉదయం 95,120 డోసులు చేరాయి. రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు లేకపోవడంతో 36 జిల్లాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేసినట్టు సమాచారం. ఒక్క చెన్నైలో మాత్రమే 1060 డోసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.
* కరోనా ప్రభావంతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలుగా మారిన చిన్నారులకు అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ అండగా నిలిచారు. అలాంటి పిల్లలను గుర్తించి సాయం చేసేందుకు వీలుగా శిశుసేవా పథకం అన్నిజిల్లాల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన 11మంది చిన్నారులకు ఆర్థిక సాయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు, చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 7,81,002 ఫిక్స్డ్ డిపాజిట్, ల్యాప్టాప్, ఈ నెలకు సాయంగా రూ.3,500 అందజేశారు.
* దిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. 75,133 శాంపిల్స్ పరీక్షించగా.. 305 కొత్త కేసులు; 44 మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 0.41శాతంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ వీడియో వైరల్ కాగా, తాజాగా రణ్వీర్సింగ్కు అదే పరిస్థితి ఎదురైంది. -
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న లైంగిక ఆరోపణల కేసులో మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలోనే న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. -
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
Seized Ship: ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. -
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో నిందితుల నుంచి కీలక వివరాలు బయటపడుతున్నాయి. వారు ఈ దాడి కుట్రకు వాడేసిన పాత ఫోన్లనే వినియోగించినట్లు తేలింది. -
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
అంతరిక్షం కూడా భవిష్యత్ యుద్ధాలకు వేదికగా మారిందని భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. -
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
Arvind Kejriwal: బెయిల్ కోసం దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ పెంచుకునేందుకు స్వీట్లు, మామిడి పండ్లను తింటున్నారని కోర్టుకు తెలిపింది. -
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియాశ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్