Corona pandemic: నేటి ‘పాజిటివ్’ న్యూస్!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేలాదిగా నమోదవుతున్న మరణాలు ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత.. ...
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేలాదిగా నమోదవుతున్న మరణాలు ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల కొరత.. ఆస్పత్రుల్లో ఔషధాల సమస్య వేధిస్తున్నాయి. రోజురోజుకీ కొత్త కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతుండటం కలవర పెడుతోంది. మరోవైపు, బ్లాక్ ఫంగస్ కేసులు కొవిడ్ బాధితులను మరింత ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వార్తలు ఊరట కలిగిస్తున్నాయి. కొవిడ్ వేళ... కొన్ని పాజిటివ్ వార్తలు మీకోసం..
* కరోనా యాంటీ బాడీలను గుర్తించేందుకు డీఆర్డీవో కొత్త కిట్ను అభివృద్ధి చేసింది. ‘డిప్కొవాన్’ పేరుతో తీసుకొచ్చిన ఈ కిట్ కరోనా ఎక్స్పోజర్ను అంచనా వేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. దిల్లీలోని వాన్గార్డ్ డయాగ్నొస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో కలిసి దీన్ని రూపొందించింది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కిట్కు ఏప్రిల్లోనే ఐసీఎంఆర్ ఆమోదం లభించింది.
* దేశంలో గత ఆరు రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీ అవుతున్నవారి సంఖ్య భారీగా నమోదవుతోంది. కరోనా ప్రవేశించిన తర్వాత దేశంలోనే తొలిసారి అత్యధికంగా మే 18న 4.22లక్షల మంది కోలుకోవడం విశేషం. మే 17 నుంచి ఇప్పటివరకు రోజువారీగా వస్తున్న కేసులు 3లక్షల లోపు ఉంటుండగా.. రికవరీ అవుతున్నవారి సంఖ్య 3.5లక్షల మందికి పైగా ఉంటుండటంతో క్రియాశీల కేసులు తగ్గుతున్నాయి.
* కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయుర్వేదం ఆధారిత విధానాలు, పరిష్కారాలను సూచించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కమ్యూనిటీ సపోర్ట్ హెల్ప్లైన్ను ప్రారంభించింది. 14443 నంబర్ అన్ని రోజుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఉదయం 6గంటల నుంచి అర్ధరాత్రి వరకు పనిచేస్తుందని.. ఆయుర్వేదం, హోమియోపతి, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపింది. ప్రజలు సంప్రదించి ఆయా రంగాల నిపుణుల సేవలను పొందవచ్చని ఆయుష్ శాఖ పేర్కొంది. నిపుణులు కేవలం రోగులకు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా నివారణ చర్యలను సూచిస్తారని, సమీపంలో ఆయుష్ సంబంధిత సేవల లభ్యత గురించి కూడా చెబుతారని ఓ ప్రకటనలో వెల్లడించింది.
* కరోనా సెకండ్ వేవ్లో ముఖ్యంగా ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు పెరిగిపోయాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా సింపుల్గా మన ఫోన్లోని ఒక యాప్తో శరీరంలోని ఆక్సిజన్ స్థాయి, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ‘కేర్ప్లిక్స్ వైటల్స్ యాప్’అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. కోల్కతాకు చెందిన ‘కేర్ నౌ హెల్త్కేర్’ అనే అంకుర సంస్థ ఈ యాప్ను రూపొందించింది.
* భారత్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ డిమాండ్కు సరిపడా డోసులు అందుబాటులోకి రావడం లేదు. వీటిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ ఈనెల 24 నుంచి ఐదురోజుల పాటు అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ కంపెనీలతో ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. భారత్లో కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి, వ్యాక్సిన్ల కొరత ఏర్పడిన సమయంలో విదేశాంగ మంత్రి అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
* కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి భారీగా నిధులు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్బీఐ కేంద్రానికి డివిడెంట్ రూపంలో చెల్లించనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
* కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధాని నగరానికి మహమ్మారి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. దిల్లీలో ఏప్రిల్ మాసంలో దాదాపు 36శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 4.7శాతానికి తగ్గడం విశేషం. గడిచిన 24గంటల వ్యవధిలో 3009 కేసులు రాగా.. 252 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 4 తర్వాత పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ నమోదుకావడం ఇదే తొలిసారి. 5శాతం కన్నా తక్కువ ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టేనని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
* కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్కు సహకారం అందించేందుకు ఐఎంఎఫ్ ముందుకొచ్చింది. టీకా ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు ఆరోగ్య రంగానికి ఆర్థిక వనరులు అందించడం అవసరమని తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని ఐఎంఎఫ్ ప్రతినిధి జెర్రీ రైజ్ తెలిపారు.
* ‘సూపర్ స్ప్రెడర్లు’.. తమకు తెలియకుండానే ఏదైనా వ్యాధిని తమ ద్వారా ఎక్కువమందికి వ్యాప్తి చేసే వాహకులను ఇలా పిలుస్తారు. తెలంగాణలో ఈ తరహా సుమారు 7-8 కేటగిరీలకు చెందిన సూపర్ స్ప్రెడర్లు (వైరస్ వాహకులు) సుమారు 15 లక్షలమంది ఉంటారని అంచనా. ‘సూపర్ స్ప్రెడర్లు’గా భావిస్తున్న వ్యక్తులకు తొలుత టీకాలందించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. దీనివల్ల వ్యాప్తిని చాలావరకూ అరికట్టవచ్చని భావిస్తున్నట్టు సమాచారం.
* లాలాజలాన్ని పరీక్షించడం ద్వారా కరోనా ఉనికిని ఒక్క సెకనులోనే గుర్తించే వినూత్న సాధనాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలన్నింటిలో ఇదే అత్యంత వేగవంతమైనదిగా పేర్కొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ సాధనాన్ని రూపొందించారు. కొవిడ్ నిర్ధారణకు ప్రామాణిక విధానంగా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలీమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్)ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ద్వారా ఫలితాన్ని తెలుసుకోవడానికి కొన్ని గంటలు లేదా రోజులు పడుతోంది. ఈ సమస్యను కొత్త విధానం పరిష్కరిస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న మింగాన్ షియాన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య