Corona Pandemic: నేటి ‘పాజిటివ్’ న్యూస్!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేలాదిగా సంభవిస్తున్న మరణాలు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 3లక్షల మార్కును దాటేసింది. ......
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కట్టడికి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. సెకండ్ వేవ్ ఉద్ధృతితో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు తీసుకొంటున్న పలు చర్యలు, నిపుణులు చేస్తున్న ప్రకటనలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. కొవిడ్ వేళ కొన్ని పాజిటివ్ వార్తలు మీకోసం..
* దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టే కనబడుతోంది. గత 17 రోజులుగా కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలే ఇందుకు ఉదాహరణ. గత 15 వారాలుగా దేశంలో కరోనా పరీక్షలు 2.6రెట్లు పెరగ్గా.. గత రెండు వారాలుగా వీక్లీ పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయి.
* దేశంలో రాబోయే థర్డ్ వేవ్లో కరోనా వైరస్ చిన్నారులపైనే అధిక ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్వేవ్లో ఈ వైరస్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న సూచనలు ఇప్పటికైతే ఏమీ లేవని స్పష్టంచేశారు. పిల్లలకు అధిక ముప్పు ఉంటుందంటూ వస్తోన్న వార్తలు వాస్తవాల ఆధారంగా చెప్పింది కాదని పిడియాట్రిక్స్ అసోసియేషన్ పేర్కొంటోందన్నారు. కరోనా వైరస్ చిన్న పిల్లలపై ప్రభావం చూపించకపోవచ్చని, ప్రజలు భయపడొద్దని ఆయన సూచించారు.
* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంలో హానికారమైన పదార్థాలేవీ లేవని ఆయుష్ విభాగం స్పష్టం చేసింది. ఔషధం కోసం మొత్తం 18 మూలికలు వాడినట్లు తెలిపింది. వాటిపై పూర్తిగా చర్చించామని, వివరాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలిపామని ఆయుష్ కమిషన్ రాములు మీడియాకు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. ఆ మందుతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని ఆయన అన్నారు.
* టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే ఆన్సైట్ లేదా వాక్-ఇన్ (అప్పటికప్పుడు) రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా వేయించుకోవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ వృథాను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
* కొవిడ్ రోగులకు చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్టెయిల్ (కాసిరివిమాబ్, ఇమ్డివిమాబ్) భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఔషధ తయారీ సంస్థ రోచ్ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేశాయి. దీని ధర డోసుకు రూ.59,750గా నిర్ణయించినట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. తొలి బ్యాచ్లో భాగంగా లక్ష ప్యాక్లను ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేశారు. జూన్ మధ్య కాలం నాటికి రెండో బ్యాచ్ ప్యాక్లు అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి. ఒక్కో ప్యాక్ను ఇద్దరు రోగులకు అందించవచ్చు.
* కరోనా వైరస్ను అంతమొందించేందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన పలు వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయినా కొత్తరకాలు వెలుగు చూడడం, వ్యాక్సిన్ల వల్ల పొందే రోగనిరోధక సామర్థ్యం కొంతకాలం వరకే పరిమితమవుతుందన్న నిపుణుల అంచనాలతో బూస్టర్ డోసుల అవసరం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సంస్థలు ఇప్పటికే వాటిపై దృష్టి పెట్టాయి. తాజాగా స్వదేశంలో అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ బూస్టర్ డోసు ప్రయోగాలను భారత్ బయోటెక్ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 190 మందిపై ఆరు నెలలపాటు అధ్యయనం చేపట్టనున్నారు.
* కరోనా సమయంలో రేషన్ దుకాణాల వద్దకు వచ్చి ఆహార ధాన్యాలు తీసుకోలేని వారి విషయంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఇంటి వద్దకే వెళ్లి ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు గోవా పౌరసరఫరాల శాఖమంత్రి గోవింద్ గౌడె తెలిపారు. దుకాణాల వద్దకు వచ్చి దాదాపు 90శాతం మంది ఆహార ధాన్యాలను తీసుకెళ్తున్నారని, 10శాతం మంది మాత్రమే రాలేకపోతున్నారని వివరించారు. వీరిలో కరోనా రోగులు, సీనియర్ సిటిజన్లు ఉన్నారని, వారికి తమ సిబ్బందే స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందజేస్తారని మంత్రి వివరించారు.
* దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ టీకాల బ్లాక్ మార్కెట్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్కు పాల్పడినట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో నెలకొన్న టీకా కొరత సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రభుత్వ/ ప్రైవేటు ఆస్పత్రుల్లో కింది స్థాయి ఉద్యోగులు కొందరు వ్యాక్సిన్ దుర్వినియోగం/ బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడుతున్నారన్నారు. దురదృష్టవశాత్తూ వీరిలో కొందరు వైద్యులు కూడా ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు కాగా.. దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడే ఔషధాలని, వీటి వినియోగం, నిర్వహణపై జవాబుదారీతనం అవసరమన్నారు.
* కరోనా కట్టడికి బిహార్లో లాక్డౌన్ మరోసారి పొడిగించారు. లాక్డౌన్తో అమలుచేస్తున్న కఠిన ఆంక్షలు సత్ఫలితాలు ఇస్తున్నందున జూన్ 1వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం నీతీశ్ కుమార్ ట్విటర్లో ప్రకటించారు. మరోవైపు, ఉత్తరాఖండ్లోనూ లాక్డౌన్ పొడిగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ మంగళవారం ఉదయం 6గంటలతో ముగియనుండటంతో.. లాక్డౌన్ను జూన్ 1 వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
* దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అవసరమైన వైద్యశాలలకు దశల వారీగా 2 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు (10 లీటర్ల సామర్థ్యం గలవి) అందజేస్తామని బీసీసీఐ సోమవారం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు