Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను క్రమంగా సడలిస్తున్నాయి. తెలంగాణలో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ను క్రమంగా సడలిస్తున్నాయి. తెలంగాణలో పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్ కేసులు 74 రోజుల కనిష్ఠానికి చేరాయి. ఏపీలో రేపు ఒక్కరోజే 10లక్షల మందికి వ్యాక్సిన్ వేయించడమే లక్ష్యంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. కరోనా కష్ట సమయంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..
* తెలంగాణలో కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో లాక్డౌన్ను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యశాఖ అందించిన నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. ఆదివారం నుంచి సంపూర్ణంగా లాక్డౌన్ ఎత్తివేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. జులై 1నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలు పూర్తి సన్నద్ధతతో ప్రారంభించాలని ఈ మేరకు విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేసింది.
* ఏపీలో ఆదివారం ఒక్కరోజే 10లక్షల మందికి టీకా వేయించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులతో పాటు 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు విదేశాలకు వెళ్లేవారు కూడా తమ సమీపంలోని టీకా కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు.
* నిజామాబాద్ జిల్లా బికనెల్లి గ్రామ సర్పంచ్ తమ గ్రామాన్ని మాస్క్ ఫ్రీ విలేజ్గా ప్రకటించారు. కరోనా మొదటి, రెండో వేవ్లో తీసుకున్న పటిష్ట చర్యల వల్లే గ్రామంలో ఎవరికీ కొవిడ్ సోకలేదని సర్పంచ్ నాగకళ తెలిపారు. తమ గ్రామంలో మాస్క్లు వాడకుండానే తిరుగుతున్నామని, బయటి గ్రామాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా మాస్క్లు ధరిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు.
* దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 1647 మరణాలే నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. అలాగే, యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 74 రోజుల కనిష్ఠానికి (7.6లక్షలు) చేరింది. దేశంలో కొత్తగా 60.7 వేల కేసులు నమోదు కాగా.. రికవరీ రేటు 96.16శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.98%కి దిగగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.58శాతంగా ఉంది.
* రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 2.87 కోట్ల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదనంగా మరో 52.26 లక్షల డోసులను రాష్ట్రాలకు మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇకపోతే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 33లక్షల డోసుల టీకాను పంపిణీ చేశారు.
* భారీ వ్యాక్సినేషన్తోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమన్న నిపుణుల సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అసోంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ పది రోజుల్లోనే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. జులై 1నుంచి కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు వీలుగా ఈ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, జూన్ 21నుంచి రోజుకు మూడు లక్షల చొప్పున టీకాలను వేయాలన్నారు. నెలలో రాష్ట్రంలోని సగం మందికి వ్యాక్సిన్ వేయాలని భావిస్తోంది. అలాగే, ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు.
* కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చిన సందర్భంలో ఆక్సిజన్ అందక అల్లాడిన రాష్ట్రాలకు ప్రాణవాయువు పంపిణీ చేసేందుకు కేంద్రం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే, ఇప్పటివరకు ఈ రైళ్ల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు 18వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) సరఫరా చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 32,464 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్టు తెలిపింది. మొత్తం 448 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లలోని 1854 ట్యాంకర్లతో 15 రాష్ట్రాలకు ఆక్సిజన్ సకాలంలో అందజేసినట్టు పేర్కొంది. తెలంగాణకు 3300 మెట్రిక్ టన్నులు, ఏపీకి 4100 మెట్రిక్ టన్నుల చొప్పున పంపిణీ చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
* తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి. గడిచిన 24గంటలల్లో 1,23,005 శాంపిల్స్ పరీక్షించగా.. 1362 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 10మంది మృతి చెందగా.. 1813మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,568 క్రియాశీల కేసులు ఉన్నాయి.
* మహారాష్ట్రలోని ఠానే పురపాలక శాఖ అధికారులు హిజ్రాల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు డాక్టర్ సురేశ్ ఠాకూర్ తెలిపారు. మరోవైపు, త్రిపురలో 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి రతన్లాల్ నాథ్ ప్రకటించారు. పరీక్ష రాయాలనుకొనే విద్యార్థుల కోసం పరిస్థితులు సద్దుమణిగాక నిర్వహిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?