Corona: ఊరటనిచ్చే ‘పాజిటివ్’ న్యూస్!
దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుతోంది. వ్యాక్సినేషన్ పుంజుకొంటుండగా.. రికవరీ రేటు కూడా పెరుగుతోంది. మరోవైపు, యాక్టివ్ కేసుల కొండ కరుగుతోంది. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలకు సందర్శకులను ......
ఇంటర్నెట్ డెస్క్: దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గుతోంది. వ్యాక్సినేషన్ పుంజుకొంటుండగా.. రికవరీ రేటు కూడా పెరుగుతోంది. మరోవైపు, యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాలకు సందర్శకులను అనుమతించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుతున్నాయి. ముంబయిలోని ధారవిలో ఈరోజు ‘సున్నా’ కేసులు నమోదయ్యాయి. కరోనాపై పోరులో వినూత్న ప్రయోగాలు కొనసాగుతున్నాయి. పాకెట్ వెంటిలేటర్, కొవిడ్ అలారం వంటి కొత్త పరికరాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కరోనా కష్టకాలంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..
👍 తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో 1.10లక్షలకు పైగా టెస్ట్లు చేయగా 1511 కొత్త కేసులు నమోదయ్యాయి. , 12 మంది మృతిచెందగా.. 2175మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.36శాతంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు, ఏపీలో నిన్న 87,756 శాంపిల్స్ పరీక్షించగా.. 4549 కేసులు నమోదయ్యాయి. 59 మంది మృతిచెందగా.. 10,114 మంది కోలుకున్నారు.
👍 రద్దీగా ఉన్న ప్రాంతంలో కొవిడ్-19 సోకిన వ్యక్తిని అక్కడికక్కడే పసిగట్టే ఒక సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సదరు వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను ఇది విశ్లేషించి, ఈ నిర్ధారణ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ సాధనానికి ‘కొవిడ్ అలారం’ అని పేరు పెట్టారు. కరోనా బాధితుల నుంచి ఒకింత విభన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు.
👍 రాష్ట్రంలో రోజుకు 2లక్షల మందికి వ్యాక్సినేషన్ జరుగుతోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 80లక్షల డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. జ్వర సర్వే మూడు రౌండ్లు పూర్తయిందని, దీని ద్వారా 4లక్షలకు పైగా కిట్లు పంపిణీ చేసినట్టు మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. ఇంటింటి సర్వే కొనసాగిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9.25లక్షల డోసుల టీకా నిల్వ ఉన్నట్టు తెలిపారు.
👍 ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పిలవబడే మహారాష్ట్ర ముంబయిలోని ధారవి ప్రాంతంలో తొలిసారి సున్నా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ధారవిలో 6841 కేసులు రాగా.. ప్రస్తుతం అక్కడ 13 క్రియాశీల కేసులు ఉన్నాయి.
👍 బెంగాల్లో లాక్డౌన్ ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం జులై 1వరకు పొడిగించింది. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు 25శాతం సామర్థ్యంతో పనిచేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు సీఎం మమతాబెనర్జీ తెలిపారు. అలాగే, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు 25శాతం సామర్థ్యం మించకుండా కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిచ్చింది.
👍 భారత్లో చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఊపందుకున్నాయి. పిల్లల కోసం భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 12 నుంచి 18ఏళ్ల వారిపై ప్రయోగాలు పూర్తికాగా.. తాజాగా 6నుంచి 12ఏళ్ల చిన్నారులపై మంగళవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు దిల్లీ ఎయిమ్స్లో ఏర్పాట్లు చేశారు.
👍 కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16నుంచి దేశవ్యాప్తంగా మ్యూజియాలు, చారిత్రక ప్రదేశాలు, కట్టడాలకు సందర్శకులను అనుమతించనున్నట్టు ప్రకటించింది. సందర్శకులు ఆన్లైన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
👍 కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన నొవావాక్స్ సంస్థ అభివృద్ధి చేసిన టీకా 90శాతం సమర్థతతో పనిచేస్తోందని మూడో దశ ఫలితాల్లో వెల్లడించింది. ఇది కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలోనూ సమర్థంగా పనిచేస్తుందని ఆ సంస్థ తెలిపింది. అమెరికాతో పాటు మెక్సికోలో దాదాపు 30వేల మందిపై జరిపిన ప్రయోగ్రాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఈ ఫలితాలు వెల్లడించింది. ప్రపంచ దేశాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తోన్న తరుణంలో నొవావాక్స్ అందుబాటులోకి రానుండడం ఊరట కలిగించే విషయం. మరోవైపు, ఈ వ్యాక్సిన్ తయారీని భారత్లో చేపట్టేందుకు పుణెలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది.
👍 కరోనా కష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి మద్రాస్ ఐఐటీ పూర్వవిద్యార్థులు భారీ విరాళం అందజేశారు. రూ.1.5 కోట్ల విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ్ విద్యార్థుల తరఫున ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా, సురేశ్ బాబు
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటీ 1993 బ్యాచ్ విద్యార్థులను సీఎస్ అభినందించారు.
👍 కరోనాతో శ్వాస సంబంధమైన సమస్యలు ఎదుర్కొనే వారి కోసం ‘పాకెట్ వెంటిలేటర్’ని తయారుచేశారు కోల్కతాకు చెందిన రామేంద్ర లాల్ముఖర్జీ అనే ఎలక్ట్రానిక్ ఇంజినీర్. దీని సాయంతో పూర్తిస్థాయి వైద్యం అందేలోపు రోగి ప్రాణాలను నిలబెట్టుకోవచ్చంటున్నారు. కొన్ని రోజుల క్రితం కొవిడ్బారిన పడిన ఆయన.. తీవ్రమైన శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తాను అనుభవించిన బాధలు ఇంకెవరూ పడకూడదన్న సంకల్పంతో తనకున్న పరిజ్ఞానంతో ‘పాకెట్ వెంటిలేటర్’నుతయారు చేశారు.
👍 దేశంలో కరోనా వైరస్ అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు మరి కాస్త తగ్గాయి. 74 రోజుల తర్వాత భారీ స్థాయిలో తగ్గి 70,421 కేసులు రికార్డయ్యాయి. వరుసగా 32వ రోజు కూడా కొత్త కేసుల కన్నా రికవరీలే భారీగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.72శాతానికి తగ్గగా.. 66 రోజుల తర్వాత తొలిసారి క్రియాశీల కేసుల సంఖ్య 10లక్షల కన్నాదిగువకు చేరింది. అలాగే, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రాలకు ఇప్పటివరకు 26,68,36,620 డోసులు పంపిణీ చేయగా.. ఈ ఉదయం 8గంటలవరకు 25,27,66,396 డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్రం సోమవారం వెల్లడించింది. ఇంకా రాష్ట్రాల వద్ద 1,40,70,224 డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మూడు రోజుల్లో మరో 96,490 డోసులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఆదివారం 14.9లక్షల డోసులు పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్