CPEC: పాక్లో కష్టమే..!
పాక్-చైనా స్నేహానికి సీపెక్(చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్)ను ఉదాహరణగా చెబుతారు. కానీ, ఇప్పుడు ఆ సీపెక్లోని ప్రాజెక్టులే ఇబ్బందుల్లో
సీపెక్పై పెదవి విరిచిన చైనా కంపెనీలు
ఇంటర్నెట్డెస్క్: పాక్- చైనా స్నేహానికి సీపెక్ (చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్)ను ఉదాహరణగా చెబుతారు. కానీ, ఇప్పుడు ఆ సీపెక్లోని ప్రాజెక్టులే ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలు తమ కార్యాలయాలను పాక్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నాయి. అందులో ఓ కంపెనీ అయిన చైనా హర్బర్ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (సీహెచ్ఈసీ) పలు ఇబ్బందులను గుర్తించి పాక్ను వీడే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇది చైనా కమ్యూనికేషన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అనుబంధ సంస్థ.
సీహెచ్ఈసీ సంస్థ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో తలమానికంగా భావించే గ్వాదర్ పోర్టు పనులను చేస్తోంది. మొత్తం ఎనిమిది అంశాల్లో పాక్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని తెలిపింది. ఇమ్రాన్ ప్రభుత్వం తీవ్ర రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కోవడం, ఉగ్ర దాడుల కారణంగా సామాజిక అస్థిరత్వం, ఆర్థిక అస్థిరత కారణంగా రుణాలు చెల్లించలేకపోవడం, పాక్ కరెన్సీ విలువ కోల్పోవడం, పడిపోతున్న ఫారెక్స్ నిల్వలు, చైనా సంస్థలపై భారీగా పన్నులు విధించడం, ప్రాజెక్టులో జాప్యాలు, కొవిడ్ నియంత్రణకు పరిమితంగానే చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సీహెచ్ఈసీ పలు సూచనలు కూడా చేసింది. పాక్ ప్రజల్లో చైనీయుల ఇమేజ్ను పెంచడం, భద్రతా పరమైన చర్యలు చేపట్టడం, చైనీయులకు పాక్ చట్టాలపై అవగాహన కల్పించడం వంటివి చేయాలని పేర్కొంది. ఇటీవల చైనాకు చెందిన హెనాన్ నార్మల్ యూనివర్శిటీ, పీఎల్ఏ ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ ఒక సర్వే చేపట్టాయి. ఇవి కూడా పాక్లో తీవ్ర అస్థిరత నెలకొందని వెల్లడించాయి.
దాదాపు 47 బిలియన్ డాలర్లతో చేపట్టిన సీపెక్ ప్రాజెక్టు ఖర్చు 2020 నాటికి 62 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే పవర్ ప్రాజెక్టులు, స్పెషల్ ఎకనామిక్ కారిడార్లను సిద్ధం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్- భారత్ సరిహద్దు వెంబడి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దీనివల్ల హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గం చైనాకు దక్కుతుంది. సీపెక్తో తమ దేశంలో మౌలికవసతులు వృద్ధి చెందుతాయని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీపెక్ భద్రతను చైనా దళాలే చూసుకొంటున్నాయి. దీని రక్షణ కోసం ఇరుదేశాలు 25వేల మంది సైనికులను మోహరించాలని గతంలో నిర్ణయించాయి. చైనా, పాకిస్థాన్ ఎస్ఎస్డీఎన్ (స్పెషల్ సర్వీసెస్ డివిజన్ నార్త్), ఎస్ఎస్డీఎస్ (స్పెషల్ సర్వీసెస్ డివిజన్ సౌత్) బలగాలను సీపెక్ వెంబడి మోహరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ రెండు డివిజన్లలో మొత్తం ఆరుగురు బ్రిగేడియర్లు, పాకిస్థాన్ కమాండర్లు, రేంజర్లు, ఫ్రాంటియర్ కార్ప్స్, పారామిలిటరీ దళాలు ఉండనున్నాయి.
మరోపక్క పాక్ ప్రభుత్వ అప్పులు ప్రమాదకర స్థాయికి చేరుకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2020 డిసెంబర్ నాటికి అప్పులు 294 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది పాకిస్థాన్ జీడీపీలో 109 శాతానికి సమానం. దేశీయ రుణదాతలకే 158.9 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. విదేశీ అప్పులు దాదాపు 115 బిలియన్ డాలర్లు ఉన్నాయి. పారిస్ క్లబ్ నుంచి 11 బిలియన్ డాలర్లు, వివిధ దేశాల నుంచి 33 బిలియన్ డాలర్లు, ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లకు పైగా పాక్ సమీకరించింది. అంతేకాదు, బాండ్ల రూపంలో కూడా అంతర్జాతీయంగా 12 బిలియన్ డాలర్ల నిధులను తీసుకొచ్చింది. ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉండటంతోనే సీహెచ్ఈసీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!