నాకు విషమిచ్చారు: ఇస్రో శాస్త్రవేత్త
భారత అంతరిక్ష అధ్యయన సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల కిందట తనపై విష ప్రయోగం జరిగిందని, తనను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
బెంగళూరు: భారత అంతరిక్ష అధ్యయన సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల కిందట తనపై విష ప్రయోగం జరిగిందని, తనను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కోరారు. ఈ మేరకు ‘సుదీర్ఘకాలం నుంచి ఉన్న రహస్యం’ టైటిల్తో ఫేస్బుక్లో ఈ సంచలన ఆరోపణలు చేసినట్లు పీటీఐ కథనం వెల్లడించింది.
2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ సమయంలో తనపై విష ప్రయోగం జరిగిందని తపన్ మిశ్రా అన్నారు. తాను తీసుకున్న దోశ, చట్నీలో ప్రమాదకర ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్ను కలిపారని ఆరోపించారు. ఈ విషం కారణంగా తన ఆరోగ్యం చాలా దెబ్బతిందని.. కోలుకునేందుకు దాదాపు రెండేళ్లు పట్టిందన్నారు. విష ప్రయోగం జరిగిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చర్మంపై అసాధారణ దద్దుర్లు, న్యూరాలజీ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. రెండేళ్ల పాటు అహ్మదాబాద్, ముంబయి, దిల్లీ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని తాను ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. అయితే, ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని అన్నారు. దాని వల్లే వైద్యులు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విషప్రయోగం జరిగిన రెండు మూడు వారాలకే తాను చనిపోయేవాడినని చెప్పారు.
గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని తపన్ మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని చాలా రోజులు రహస్యంగా దాచి ఉంచాల్సి వచ్చిందని అన్నారు. విష ప్రయోగం గురించి బయటకు చెప్పకూడదంటూ వందల కొద్దీ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు సంచలన ఆరోపణలు చేశారు. కొందరైతే క్విడ్ ప్రో కో ప్రాతిపదికన తనతో బేరసారాలు కూడా జరిపారని అన్నారు. అయితే వాటిని తాను తిరస్కరించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఇస్రో కీలక బాధ్యతల నుంచి తనను తొలగించినట్లు వెల్లడించారు.
ఇప్పటికీ ఈ రహస్యాన్ని బహిర్గతం చేయకుండా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయని తపన్మిశ్రా ఆరోపించారు. మానసిక స్థితి సరిగా లేని తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని, గతేడాది సెప్టెంబరులోనూ తనపై మరోసారి విష ప్రయోగానికి విఫలయత్నం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు.
ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్కు డైరెక్టర్గా వ్యవహరించిన తపన్ మిశ్రా.. ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. జనవరి చివర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే మిశ్రా వ్యాఖ్యలపై ఇస్రో ఇంకా స్పందించలేదు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా