Bihar: ఛఠ్‌పూజ వేళ.. సిలిండర్లు పేలి భారీగా ఎగిసిపడ్డ మంటలు..!

బిహార్‌లో శాహ్‌గంజ్‌ ప్రాంతంలో ఛఠ్‌ పూజ నిమిత్తం ఓ కుటుంబం శనివారం తెల్లవారుజామున వంట సిద్ధం చేస్తోంది. ఈ సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 

Updated : 29 Mar 2024 14:07 IST

(ప్రతీకాత్మక చిత్రం)

ఔరంగాబాద్‌: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వంట చేస్తోన్న సమయంలో సిలిండర్లు పేలి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఛఠ్‌పూజకు సిద్ధమవుతోన్న వేళ.. ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

నగరంలోని శాహ్‌గంజ్‌ ప్రాంతంలో ఛఠ్‌ పూజ నిమిత్తం ఓ కుటుంబం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో వంట సిద్ధం చేస్తోంది. సూర్యోదయం లోపులో ప్రసాదం తయారుచేసే పనిలో నిమగ్నమైంది. అయితే.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా సిలిండర్లకు మంటలు అంటుకుని.. భారీగా వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు చేసే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దాంతో ఈ ఘటనలో 30 మంది గాయాలపాలయ్యారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఔరంగాబాద్‌లోని సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనకుగల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని