బంగ్లాదేశ్‌లో కొనసాగిన అల్లర్లు

భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించడంపై ఆ దేశంలో ఆదివారం కూడా అల్లర్లు కొనసాగాయి. హిఫాజత్‌ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో...

Updated : 29 Mar 2021 00:22 IST

ఢాకా‌: భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించడంపై ఆ దేశంలో ఆదివారం కూడా అల్లర్లు కొనసాగాయి. హిఫాజత్‌ ఎ ఇస్లాం అనే ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ పిలుపు మేరకు ఆదివారం ఎద్దఎత్తున పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వీధుల్లో నిరసన చేపట్టారు. హిందూ దేవాలయాలపై దాడికి దిగారు. బ్రహ్మన్‌బరియాలో ఓ రైలుకు, రెండు బస్సులకు నిప్పంటించారు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పలు ప్రభుత్వ భవనాలు, ఓ ప్రెస్‌క్లబ్‌కు సైతం నిప్పంటించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు అందోళనకారులపై భాష్పవాయువు, రబ్బరు బులెట్లును ప్రయోగించారు. 


భారత్‌లో ముస్లింలపై వివక్ష చూపుతున్నారని ఇస్లామిస్ట్‌ గ్రూప్‌ హిఫాజత్‌ ఎ ఇస్లాం ఆరోపించింది. దీంతో ఆందోళనకారులు శుక్రవారం నుంచి పలుచోట్ల దాడులకు దిగారు. శుక్రవారం నుంచి ఇప్పటివరకు 10 మంది ఆందోళనకారులు మృతి చెందారు. బంగ్లాదేశ్‌ విమోచన ఉద్యమం స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ 10.2 లక్షల డోసుల కరోనా టీకాలు బహుకరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని