Mumbai: పట్టాలు తప్పిన దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ముంబయిలో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. దాదర్ పుదుచ్చేరి, సీఎస్‌ఎమ్‌టీ గదగ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వేర్వేరు ట్రాక్‌లపై ఒకే దిశలో ప్రయాణించాయి

Published : 16 Apr 2022 18:45 IST

ముంబయి: ముంబయిలో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పింది. దాదర్ పుదుచ్చేరి, సీఎస్‌ఎమ్‌టీ గదగ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు వేర్వేరు ట్రాక్‌లపై ఒకే దిశలో ప్రయాణించాయి. మాతుంగా రైల్వేస్టేషన్ సమీపంలో.. పక్కపక్కన వెళ్తున్న సమయంలో రెండు రైళ్ల బోగీలు పరస్పరం రాసుకున్నాయి. దీంతో దాదర్-పుదుచ్చేరి రైలు మూడు బోగీలు పట్టాలు తప్పింది. సిగ్నల్ జంప్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు  రైల్వే అధికారులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటనతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని