Maharashtra Crisis: వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు! ఎప్పటికీ గెలవలేరు: ఆదిత్య ఠాక్రే
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి (Maharashtra Crisis) తెరలేపిన శివసేన(Shiv sena) రెబల్ ఎమ్మెల్యేలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రే(Aaditya Thackeray) మరోసారి విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఓ జాతీయ వార్త సంస్థతో ఆయన మాట్లాడారు.
‘‘వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు. ఇక్కడి నుంచి పారిపోయి వాళ్లంతట వాళ్లే రెబల్ అని అనుకుంటున్నారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాల్సింది. ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరు. మాకు అందరి మద్ధతు ఉంది. మేం గెలుస్తామన్న నమ్మకం ఉంది’’ అని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘మహా’ రాజకీయ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జులై 11 వరకు రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రెబల్ నేతల అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే, ఈ విషయాలను ఆదిత్య ఠాక్రే నేరుగా ప్రస్తావించకుండా.. అసెంబ్లీలో జరిగే విశ్వాస తీర్మానంలో గెలుస్తామన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. బల పరీక్ష కంటే ముందు నైతిక పరీక్ష జరగాలన్నారు. ఆ సమయంలో.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తన ముందు కూర్చొని, కళ్లలోకి చూస్తూ.. ప్రభుత్వం, శివసేన ఏం తప్పు చేసిందో చెబుతారని అన్నారు. మరోవైపు మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపైనా ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘‘ఇది రాజకీయం కాదు.. ఇప్పుడు ఇదొక సర్కస్లా మారింది’’ అని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
- Solar Cycle: సూర్యుడి ఉగ్రరూపం! అసలేం జరుగుతోంది..?