Corona: నీటిలో మృతదేహాలు.. వైరస్ సంక్రమిస్తుందా?
నీటిలో మృతదేహాలు లభ్యం కావడం తీవ్రమైన విషయమయినప్పటికీ నీటి ద్వారా కరోనా వైరస్ సంక్రమణపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
గంగానది ఘటనపై ఆందోళన వద్దంటున్న నిపుణులు
దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. నదుల్లో మృతదేహాలు లభ్యం కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా అవి కొవిడ్ సోకి చనిపోయిన వారి మృతదేహాలన్న అనుమానం నదీ పరివాహక ప్రాంత ప్రజలకు మరింత భయానికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలో నీటిలో మృతదేహాలు లభ్యం కావడం తీవ్రమైన విషయమయినప్పటికీ నీటి ద్వారా కరోనా వైరస్ సంక్రమణపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
నదిలో మృతదేహాలు ప్రవహించే సమయంలో నీటిలో కరోనా వైరస్ బలహీన పడడం వల్ల సంక్రమణ చెందే ప్రభావం అంతగా ఉండదని ఐఐటీ కాన్పూర్కు చెందిన ప్రొఫెసర్ సతీష్ తారే అభిప్రాయపడ్డారు. ప్రవాహ సమయంలో నీరు శుద్ధికావడం సాధారణ ప్రక్రియలో భాగమని చెప్పారు. అక్కడ కొందరు ప్రజలు తాగునీటి కోసం నేరుగా నది నుంచే తీసుకునే సందర్భాలు ఉన్నాయని.. అలాంటి సందర్భాల్లో కొంత జాగ్రత్త పాటించాలన్నారు. కరోనా వైరస్తో దేశం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో గంగా, వాటి ఉపనదుల్లో మృతదేహాలు వేయడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. అయినప్పటికీ నీటి ద్వారా వైరస్ సంక్రమణపై ఇవి గణనీయమైన ప్రభావాన్ని చూపవని పునరుద్ఘాటించారు. గంగా, యమునా నదుల్లో మృతదేహాలను వేయడం కొత్తేమీ కాదని.. కానీ, గత దశాబ్ద కాలం నుంచి వీటి సంఖ్య తగ్గిందన్నారు. ఇవి నదుల కాలుష్యానికి కారణమవుతున్నాయని చెప్పారు.
నీటి ద్వారా వైరస్ సంక్రమణపై ఆందోళన అక్కర్లేదని నీతి ఆయోగ్ సభ్యులు (ఆరోగ్యం) వీకే పాల్ ఈ మధ్యే వెల్లడించారు. ఇలాంటి మాధ్యమాల ద్వారా వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు విజయ రాఘవన్ స్పష్టంచేశారు. ఇద్దరు వ్యక్తులు అతిదగ్గరగా ఉండి మాట్లాడుకునే సందర్భంలో, లేదా అలా మాట్లాడినప్పుడు సూక్ష్మబిందువులు పడిన ప్రదేశాన్ని మరో వ్యక్తి తాకడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా నీటిలో డైల్యూషన్ కారణంగా సూక్ష్మజీవులు పలుచన పడిపోవడం వల్ల వైరస్ సంక్రమణ ప్రమాదం తక్కువేనని పేర్కొన్నారు.
బిహార్లోని బక్సర్ జిల్లాలో గంగానదిలో దాదాపు 71 మృతదేహాలు కొట్టుకువచ్చిన విషయం తెలిసిందే. అవి కొవిడ్ సోకి మరణించిన వారి మృతదేహాలనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో నదీ పరివాహక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నీటిలో వైరస్ వ్యాప్తి ప్రమాదం తక్కువేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనను చూసి తానెంతో గర్విస్తున్నానని అన్నారు. -
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
అరవింద్ కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, అతనికి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్ను కోర్టు ఆదేశించింది. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ (Salman Khan) ఇంటివద్ద జరిగిన కాల్పులకు వాడిన తుపాకీ కోసం సూరత్లోని తపతీ నదిలో గాలింపు చేపట్టారు. -
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
మాజీ ప్రధానులపై మోదీ ఆరోపణలు చేయడంపై ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
ఎన్నికల వేళ.. ఎండలో నిలబడి ఓటు వేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన ఆకర్షిస్తోంది. -
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత
Mamata Banerjee on HC order: ఉపాధ్యాయ నియామక పరీక్ష రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
Supreme Court: లా కోర్సును మూడేళ్లకు తగ్గించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు మండిపడింది. అప్పుడు కోర్సులు ఎందుకని.. నేరుగా హైస్కూల్ తర్వాతే ప్రాక్టీస్ చేయండంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
Supreme Court: అత్యాచారానికి గురైన ఓ బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. -
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?
Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..! -
కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలి
మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్ కార్యకర్తలు తిహాడ్ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు
గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేణ్ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. -
భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్
పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ
సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. -
సీఆర్పీఎఫ్ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా రాయ్కోట్ వద్ద 32 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. -
అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!
అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. -
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ అరెస్టు
త్తీస్గఢ్లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది. -
వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లిన న్యూస్ రీడర్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. -
మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలు
సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. -
ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ చేయొచ్చు
పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(నెట్)కు హాజరుకావచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
Kolkata vs Bengaluru: టీవీ అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. విరాట్ కోహ్లీకి జరిమానా
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
అదరగొట్టిన జియో.. నికర లాభం ₹5,337 కోట్లు
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్